రాష్ట్రీయం

పిఎస్‌ఎల్‌వి-సి31 ప్రయోగం 20న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జనవరి 9: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాది తొలి ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి ఈ నెల 20న పిఎస్‌ఎల్‌వి-సి 31 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ సేవలకు సంబంధించిన 1425కిలోల బరువుగల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఇ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక వద్ద ఈ ప్రయోగానికి సంబంధించిన రాకెట్ నాలుగు దశల అనుసంధాన పనులన్నింటిని శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. రాకెట్‌లోని చివరి దశలో ఉపగ్రహాన్ని అమర్చాల్సి ఉంది. ఉపగ్రహ అమరిక పనులను సోమవారం నుండి ప్రారంభించనున్నారు. ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం ఈ నెల 17న డాక్టర్ సురేష్ అధ్యక్షతన జరగనుంది. అన్ని సజావుగా సాగితే ఈ నెల 20న ఉదయం 9:31గంటలకు రాకెట్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి నింగిలోకి ఎగరనుంది. ఇదిలా ఉండగా నావిగేషన్ సేవలకు సంబంధించిన ఏడు ప్రయోగాల్లో ఇస్రో ఇప్పటికే నాలుగు ప్రయోగాలు విజయవంతంగా ప్రయోగించింది. ఇది ఐదో ప్రయోగం కావడం విశేషం. దీంతో నావిగేషన్ సేవలు పూర్తిగా అందుబాటులోకి రానుంది. మరో రెండు ప్రయోగాలు కూడా మార్చిలోపు ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహం చేస్తోంది.