ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు రక్తసిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మే 23: విజయనగరం జిల్లాలోని డెంకాడ మండలం మహంతిపేట వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. విజయనగరం వైపు వస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరానికి చెందిన ఆటో డ్రైవ ర్ ముక్కు బంగార్రాజు ప్రయాణికులతో విజయనగరం వస్తుండగా డెంకాడ మండలం మహంతిపేట వద్ద ఎదురుగా, వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందా రు. వారిలో శ్రీకాకుళం జిల్లా పాతర్లపల్లికి చెందిన నెల్లిమర్ల అప్పారావు (33), బోగాపురం మండలం నందిగాం గ్రామానికి చెందిన మిరప గోవింద (40), డెంకాడ మండలానికి చెందిన బంగారు సూరిబాబు (33), పూసపాటిరేగ మండలం గోవిందపురానికి చెందిన గురివిందల అప్పలనాయుడు (38) ఉన్నా రు. అయ్యకోనేరుగట్టుకు చెందిన ఆర్ రాజేష్ (28) తీవ్రంగా గాయపడటంతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజేష్ మృతిచెందాడు. మరొకరికి సంబంధించి వివరాలు తెలియా ల్సి ఉంది. ప్రమాదంలో రాజేష్ సోదరుడు ఆర్ రాజశేఖర్, డెంకాడ మండలానికి చెందిన బంగారు అప్పారావు, పి శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వీరికి చికిత్స అందిస్తున్నారు.
chitram...
విజయనగరం మహంతిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను బయటకు తీస్తున్న దృశ్యం