రాష్ట్రీయం
ఏపీ భవన్లో స్వచ్ఛ్భారత్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 27 June 2017
న్యూఢిల్లీ, జూన్ 26: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా బిజెవైఎం కార్యవర్గ సభ్యుడు అడారి కిషోర్ కుమార్ నేతృత్వంలో ఏపీ భవన్ అధికారులతో కలసి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం అడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని నిర్విరామంగా 135వ రోజు సోమవారం ఢిల్లీలోని ఉమ్మడి భవన్లో కొనసాగించినట్టు తెలిపారు. తాను చేపట్టిన స్వచ్ఛ్భారత్ కార్యక్రమానికి ఢిల్లీలోని తెలుగువారి సంఘీభావం లభించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికుల ప్రతినిధులను ఏపీ భవన్ సిబ్బంది సత్కరించారు.