రాష్ట్రీయం

నిరాడంబరంగా దేవాంశ్‌కు కేశ ఖండన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, నవంబర్ 27: లోకేష్, బ్రహ్మణి దంపతుల పుత్రుడు దేవాంశ్‌కు శుక్రవారం ఉదయం నాగాలమ్మ గుడివద్ద కేశఖండన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తరలివచ్చారు. ఉదయం 9.15గంటలకు నారావారి పల్లె నుంచి చంద్రబాబు నాయుడు దంపతులు, బాలకృష్ణ దంపతులు, , లోకేష్ దంపతులు వాహనాల్లో నాగాలమ్మ గుడికి చేరుకున్నారు. చంద్రబాబు తన మనుమణ్ని ఎత్తుకుని ఆలయంలోకి దారితీశారు. సాంప్రదాయ బద్ధంగా పూజలు జరిపి కేశ ఖండన నిర్వహించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడిన చంద్రబాబు అనాదిగా హైందవ సమాజానికి మన పురాణ పెద్దలు కొన్ని సంస్కారాలు అందించారన్నారు. వాటిని మార్గదర్శకంగా తీసుకుని ముందుకు సాగడం ద్వారా సమాజాన్ని గౌరవించిన వారమవుతామన్నారు. సమాజం బాగుంటే మనం బాగుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఆలయ ఓఎస్‌డి డాలర్ శేషాద్రి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
chitram..
మనవడు దేవాంశ్‌ను ఎత్తుకుని గుడికి వస్తున్న చంద్రబాబు దంపతులు. చిత్రంలో లోకేష్ దంపతులు, బాలకృష్ణ దంపతులు కూడా ఉన్నారు.