రాష్ట్రీయం

23న జనసైన్యం రిక్రూట్‌మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలనే ఆకాంక్ష ఉన్న మేధావులు, యువత కోసం జనసేన ఔత్సాహిక వేదికలను నిర్వహించబోతోంది. నిజామాబాద్, ఖమ్మం, ఉమ్మడి జిల్లాల్లో ఈ ఔత్సాహిక వేదికలను నిర్వహించనున్నట్టు జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే 8ఉమ్మడి జిలాల్లో ఈ ప్రక్రియ పూర్తయిందని ఆయన వివరించారు. స్పీకర్లు, ఎనలిస్టులు, కంటెంట్ రైటర్ విభాగాల్లో పాల్గొని ఈ శిబిరాలను విజయవంతం చేశారని అన్నారు.
ప్రస్తుతం నిర్వహంచనున్న నిజామాబాద్, ఖమ్మం జిల్లాలతో తెలంగాణలో యువత ఎంపిక పూర్తవుతుందని చెప్పారు. ఈ నెల 23న నిజామాబాద్‌లోనూ, సెప్టెంబర్ 7న ఖమ్మంలోనూ ఈ శిబిరాలను నిర్వహిస్తామని అన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వారందరికీ ఈ మెయిల్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా శిబిరం వివరాలు, సమయాన్ని జనసేన ప్రతినిధులు తెలియజేస్తారని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేపోయిన వారు శిబిరం వద్దకు వచ్చి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.