తెలంగాణ

బోర్డు తిప్పేసిన ఎక్స్‌పర్ట్ ట్రేడింగ్ కంపెనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: నగరంలోని బోయిన్‌పల్లిలో ఓ స్టాక్ మార్కెట్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఎక్స్‌పర్ట్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో కంపెనీ భారీ మోసానికి పాల్పడింది. స్టాక్ మార్కెట్‌లో పెట్డుబడులతో అధిక లాభాలు గడించొచ్చని నమ్మించి ప్రజలకు సుమారు 4కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టింది. కంపెనీ బోర్డు తిప్పేసిన మహీశ్చందర్‌రావు అనే నిర్వాహకుడు పత్తాలేకుండా పోవడంతో పెట్టుబడులు పెట్టిన వారు లబోదిబోమంటూ బుధవారం సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. డబ్బులు వసూలు చేసుకొని బోర్డు తిప్పేసిన నిర్వాహకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు సిసిఎస్ పోలీసులు తెలిపారు.