రాష్ట్రీయం

అలసత్వం సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 12: రాష్ట్రంలో ఇకపై సీజనల్ వ్యాధులు కనిపించడానికి వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని ప్రదర్శిస్తే సహించేది లేదని చెప్పారు. ‘పేషెంట్ ఫస్ట్’ అనే విధానాన్ని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అలవర్చుకోవాలని అన్నారు. గురువారం రాత్రి విజయవాడ క్యాంప్ కార్యాలయంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అన్నిరకాల వైద్య పరీక్షలకు అవసరమైన ల్యాబరేటరీలను సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అందుబాటులో ఉన్న వైద్యులను, సహాయ సిబ్బందిని సమర్థంగా వినియోగించుకోవాలని చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా పెద్దఎత్తున పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. సీనల్ వ్యాధులు ప్రబలడానికి ముఖ్య కారణమైన దోమల్ని నియంత్రించాల్సిందేనని అధికారులకు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి, 21 లక్షల దోమతెరలను పది రోజుల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అందించాలని ఆదేశించారు. దీనిపై పరిష్కార వేదిక నుంచి అవసరమైన ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని నిర్దేశించారు. ‘సీజనల్ వ్యాధులు ఎప్పుడొస్తాయనేది ప్రతి ఏడాది తెలిసిన విషయమే. ఆ సీజన్‌కు ముందే తగిన ప్రణాళికలు తయారు చేసుకోవడం ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా మారాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు. సీజనల్ వ్యాధుల గత చరిత్ర దగ్గర పెట్టుకుని అవి ఎప్పుడు వస్తాయో స్పష్టంగా తెలుసుకుని ముందు నుంచే సమగ్ర నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై గిరిజనుల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే సహించబోనని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇకపై నెలకు ఒకసారి తప్పనిసరిగా సమీక్ష జరుపుతానని చెప్పారు. వనరులు పుష్కలంగా ఉన్నా చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ముందుకు వెళ్లలేకపోతున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మందలించారు. ఎన్టీఆర్ వైద్య పరీక్షల ద్వారా ఇప్పటివరకు 40 లక్షల 90 వేల మందికి కోటి 46 లక్షల 80 వేల 323 పరీక్షలు నిర్వహించామని అధికారులు వివరించారు. ఎన్ని పరీక్షలు చేశామన్నది లెక్కలు చెబితే కాదని, ఆ పరీక్షలు రోగికి సరైన సమయంలో చేసి తగిన ఫలితాలు సాధించామా.. లేదా.. అన్నదే ముఖ్యమని చంద్రబాబు అన్నారు. ప్రజలు సంతృప్తి చెందడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ఎక్కడ, ఎలా పనిచేస్తున్నాయో అందరికీ తెలిసేలా ఆన్‌లైన్‌లో వివరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల గ్రామీణ ప్రాంతాలలో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్యమంత్రికి వివరించారు. గత ఏడాదితో పోలిస్తే, ఈ సంవత్సరం మలేరియా, డెంగ్యు కేసులు తగ్గించగలిగామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరింత మెరుగ్గా పనిచేసి ఆరోగ్య సూచికలో అభివృద్ధి సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. పలు కారణాలతోఅనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయని చెబుతూ కారణం ఏదైనా ఎంత వేగంగా స్పందించామనేదే ముఖ్యమని అన్నారు. ప్రతి అధికారి, వైద్యుడు, సిబ్బంది తమ తమ విధులను సక్రమంగా నిర్వహించాలని, విధుల్లో అలసత్వాన్ని ఊరుకునేది లేదని తేల్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజల వైద్య రికార్డులను నిర్వహించాలని, అన్ని రికార్డులను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి చెప్పారు. ముందస్తు వ్యాధి నిరోధక చర్యలు సమర్థంగా చేపడితే వ్యాధులు తలెత్తే అవకాశమే లేదని అన్నారు.
ఐటిడిఎ పరిధిలోని గ్రామాలలో ప్రజారోగ్యం విషయంలో మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీరు, రహదారుల సమస్యలు ఇంకా కన్పిస్తున్నాయని, ఆయా ప్రాంతాలకు సమయానికి చేరుకోలేకపోవడమే అతి పెద్ద సమస్యగా ఉన్నదని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసేందుకు నిపుణులైన వైద్యులు సుముఖత వ్యక్తం చేయడం లేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అవసరమైతే ప్రభుత్వం ఈ విషయంలో విధాన నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. గిరిజన ప్రాంతాలలో వేగంగా వైద్య సేవలు అందించేందుకు బైక్ అంబులెన్సులు ప్రవేశపెట్టాలని సూచించారు. గిరిజన ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఖచ్చితంగా 24 గంటలు పనిచేయాలని చెప్పారు. ఇకపై ప్రతి నెలా తప్పనిసరిగా సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న సర్వీస్ ప్రొవైడర్లు, నాలెడ్జ్ పార్టనర్లు ఒకే వేదికపైకి తీసుకురావాలని ఆదేశించారు.

చిత్రం..వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు