రాష్ట్రీయం

ఊర కుక్కల దాడిలో చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంచికచర్ల, జనవరి 28: ఊర కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన కామా వెంకటేశ్వర్లు, వెంకట రమణ దంపతుల కుమార్తె అనన్య (3) ఉదయం ఆరుబయట ఆడుకుంటుండగా ఊర కుక్కలు మెడపట్టుకొని పొలాల్లోకి ఈడ్చుకు వెళ్లాయి. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఆడుకోవడానికి బయటకు వెళ్లిన బాలిక ఇంటిలోకి రాకపోవడంతో తల్లిదండ్రులు గాలించగా 11.30గంటల ప్రాంతంలో పొలాల్లో మృతదేహాన్ని కనుగొన్నారు. వెంకటేశ్వర్లు, వెంకట రమణ దంపతులకు ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తె సంతానం కాగా కుమార్తె కుక్కల దాడిలో మృతి చెందడంతో బోరుబోరున విలపించారు. ఎస్‌ఐ ఈశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జడ్‌పిటిసి కోగంటి బాబులు మార్చురీకి చేరుకొని చిన్నారి మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వెంటనే స్పందించి పంచాయతీల అధికారులకు ఫోన్ చేసి గ్రామాల్లో ఊర కుక్కల సంచారం తగ్గించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు.