తెలంగాణ

టిప్పర్-ఆటో ఢీ ఆరుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల/జైపూర్, జనవరి 29: ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్-మంచిర్యాల 63వ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చెన్నూర్ నుంచి మంచిర్యాల వైపు వస్తున్న ఆటో నెంబర్ టీ ఎస్ 02 యుఏ6019 , చెన్నూర్‌కు డాంబర్ లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ నెంబర్ ఏపీ 1డబ్ల్యూ 4180 ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పోలం పల్లి సమీపంలోని మాంతమ్మగుడి సమీపంలో లారీ, ఆటో ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న చెన్నూర్‌కు చెందిన సిద్ది మదుకర్ (20), బత్తుల నరేష్ (20), జైపూర్ మండలం ఆరెపెల్లికి చెందిన ఆయిటిసాముల మల్లయ్య (45), రమేష్ (20), డేగ మహేందర్ (17), మంచిర్యాల మండలం నస్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని నాగార్జున కాలనీకి చెందిన మల్లమ్మ (50) లు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆటోను టిప్పర్ ఢీకొనడంతో ఆటో టిప్పర్ కింద పడి దాదాపు 50మీటర్ల దూరం ఈడ్చుకు వెళ్లడంతో ఆటో నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రమాద స్థలంలోనే మృతిచెందగా, ఆటో డ్రైవర్ నాగుల సురేష్ కొన ప్రాణంతో ఉండగా, ఆటోలో నుంచి బయటికి తీసేందుకు దాదాపు అరగంటపాటు పోలీసులు, స్థానికులు శ్రమించారు. ఆటో డ్రైవర్ సురేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో 108లో కరీంనగర్ తరలించారు. కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స చేసిన అనంతరం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనా స్థలాన్ని బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్, మంచిర్యాల ఏ ఎస్పీ విజయ్‌కుమార్, శ్రీరాంపూర్ సి ఐ వేణుచందర్‌లు సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోలీసులు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేస్తున్నారు.

టిప్పర్ ఢీకొని నుజ్జునుజ్జు అయన ఆటో