రాష్ట్రీయం

అనంత పెట్టుబడులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 18: రాష్ట్రానికి సుమారు రూ.4 వేల కోట్ల పెట్టుబడులతో 37 కొరియా కంపెనీలు తరలిరానున్నాయి. వీటి ద్వారా 7 వేల మందికి ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వీటిల్లో అత్యధికం ఆటోమొబైల్ రంగానికి చెందినవే. వచ్చే ఏడాది మార్చికల్లా ఇవి కార్యరూపం దాల్చనున్నాయి. ఆంధ్రలో ఏర్పాటు చేసే కొరియన్ సిటీలో భారీ పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొల్పేందుకు తమ దేశంలోని పలు కంపెనీలు సిద్ధంగా వున్నాయని దక్షిణ కొరియా కౌన్సిల్ జనరల్ కిమ్ హంగ్ టే సిఎం చంద్రబాబుకు వివరించారు. శనివారం సచివాలయంలో సీఎం చంద్రబాబుని కిమ్ హంగ్ టే మర్యాదపూర్వకంగా కలిశారు. అత్యధిక వృద్ధిరేటు, స్నేహపూర్వక వాతావరణం, చంద్రబాబు విజన్ వంటి అంశాలు తమను ఏపీ వైపు ఆకర్షించేలా చేశాయని కిమ్ హంగ్ టే వివరించారు. ఏపీతో ఆర్థిక సంబంధాలే కాకుండా సాంస్కృతిక, సామాజిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని తమదేశం భావిస్తోందన్నారు. ఏపీ నుంచి కొరియాకు మిర్చి, పొగాకు, టెక్స్‌టైల్స్, చీరల ఎగుమతులకు ప్రోత్సాహం అందిస్తామన్నారు.
అనంతపురం జిల్లాలో త్వరలో ఏర్పాటు చేసే ‘కొరియన్ సిటీ’ అంశంపైనా ఇరువురూ చర్చించారు. విజ్ఞాన సముపార్జనలో భాగంగా ఇరు ప్రాంతాల విద్యార్థుల పరస్పర మార్పిడికి ఒక ప్రణాళిక రూపొందించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. త్వరితగతిన ‘కొరియన్ సిటీ’ నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం సృష్టించామని వివరించారు. దక్షిణ కొరియా నుంచి తరలివచ్చే కంపెనీల కోసం ఏపీ ఈడీబీ, ఇంకా తమ ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా పనిచేస్తున్నాయన్నారు. కొరియా లాంగ్వేజ్ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పాలని కిమ్ హంగ్ టే ఈ సందర్భంగా సీఎం బాబుని కోరారు. రాష్ట్రంలోని యువతను ప్రపంచస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియాకు చెందిన కోచ్‌లతో శిక్షణ అందిస్తామని వివరించారు. సమావేశంలో దక్షిణ కొరియా డెప్యూటీ కౌన్సిల్ జనరల్ డేసూ చాంగ్, సీఎం ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఏపీ ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిషోర్ పాల్గొన్నారు.

చిత్రం..సీఎం చంద్రబాబుతో సమావేశమైన కొరియన్ ప్రతినిధి బృందం