రాష్ట్రీయం

7న పోలవరానికి వైకాపా బస్సుయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: ఈ నెల 7వ తేదీన పోలవరం ప్రాజెక్టుకు బస్సు యాత్ర చేపట్టాలని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం చేతులెత్తేస్తూ దానికి శాశ్వతంగా సమాధి కట్టేలా వ్యవహరిస్తున్న నేపధ్యంలో ఈ దుర్మార్గ వైఖరిని ప్రజలకు వెల్లడించేందుకు బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు పార్టీ తెలిపింది. ఈ నెల 7వ తేదీ ఉదయం అమరావతిలోని పార్టీ కార్యాలయం వద్దకు పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు చేరుకోవాలని తెలిపింది. అక్కడి నుంచి పోలవరం వరకు బస్సుల ద్వారా చేరుకోవడం జరుగుతుందని పేర్కొంది. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు పిండుకునేందుకు పోలవరం ప్రాజెక్టును అడ్డంగా పెట్టుకుని వ్యవహారం నడిపారని, ఇప్పుడు వదిలేసేందుకు పన్నాగం పన్నారని తెలిపింది. పోలవరం ప్రాజెక్టును రక్షించుకునేందుకు, సత్వరం నిర్మించుకునేందుకు అన్ని రకాల ఒత్తిడి తీసుకువచ్చే విధంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందించిందని అన్నారు.