రాష్ట్రీయం

రాష్టప్రతి కోవింద్‌కు ఘనంగా వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 8: రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖ విచ్చేసిన భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు శుక్రవారం తిరిగి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ సందర్భంగా ఐఎన్‌ఎస్ డేగా ఎయిర్ స్టేషన్‌లో ఘనంగా వీడ్కోలు లభించింది. రాష్టప్రతికి వీడ్కోలు పలికిన వారిలో గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్ అండ్ బి శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు, భారత ప్రధాన నౌకాదళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా, ఆయన సతీమణి రీనాలాంబా, తూర్పు నౌకాదళ అధికారి వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, డీజీపీ సాంబశివరావు, నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ తదితరులు ఉన్నారు.

చిత్రం..రాష్టప్రతికి వీడ్కోలు పలుకుతున్న గవర్నర్ నరసింహన్ దంపతులు