రాష్ట్రీయం

శ్రీ బేడి ఆంజనేయ స్వామికి ఘనంగా అభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 10: తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ప్రత్యేక అభిషేకం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది కార్తీకమాసం ఆదివారం స్వామికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పురాణాల ప్రకారం తిరుమలలో శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. అంజనీపుత్రుడైన ఆంజనేయుడు ఎంతో బలవంతుడు. అంతకుమించి పరమ భక్తుడు, త్రేతాయుగంలో శ్రీరామావతారంలో శ్రీమన్నారాయణునికి సేవకుడిగా, స్నేహితుడిగా, భక్తుడికి దాస్యభక్తిని చాటాడు. ప్రస్తుతం కలియుగంలో సాక్షాత్తు శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల పూజలందుకుంటున్నారు. ఈ అభిషేకం కార్యక్రమంలో టీటీడీ శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ కోదండరామారావు, పేష్కార్లు రమేష్‌బాబు, అశోక్ పాల్గొన్నారు.