రాష్ట్రీయం

కాంగ్రెస్‌కు 70 స్థానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ప్రజలు పట్టం కట్టనున్నారని అన్ని సర్వేల్లోనూ వెల్లడవుతున్నదని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం గాంధీభవన్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన టి.పిసిసి కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల వారూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అన్నీ సర్వేల్లోనూ స్పష్టమవుత్నుదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు
జరిగితే తమ పార్టీకి 70 స్థానాలు లభిస్తాయని ఆయన తెలిపారు. ఒకవేళ గడువు ప్రకారమే వచ్చే ఏడాది ఎన్నికలు జరిగితే, అప్పటి వరకు తమ పార్టీకి ఇంకా సీట్లు పెరుగుతాయని ఆయన నమ్మకంగా చెప్పారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్వతహాగా చేయించుకున్న సర్వేలోనూ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడైందన్న సమాచారం తమ వద్ద ఉందన్నారు. తమ పార్టీలోకి వివిధ పార్టీల నుంచి ప్రతి రోజూ అనేక మంది చేరుతున్నారని ఆయన తెలిపారు. సంక్రాంతి పండుగ తర్వాత ఇంకా అనేక మంది తమ పార్టీలో చేరనున్నారని ఆయన చెప్పారు. టిఆర్‌ఎస్ పెద్ద నాయకులు, పలువురు సిట్టింగ్‌లూ పార్టీలో చేరేందుకు ‘టచ్’లో ఉన్నారని ఆయన తెలిపారు.
టి.పిసిసి కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా సోషల్ మీడియాను మరింత విస్తృతంగా వినియోగించుకునే అంశంపై చర్చించామన్నారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని నాయకులు సీరియస్‌గా తీసుకోవాలని, ప్రతి ఒక్క ఓటరును పరిశీలించాలని, పోలింగ్ బూత్ స్థాయిలో సమగ్రంగా చూడాలన్నారు. తెలంగాణలో డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో ఒక కమిటీని వేసి పరిశీలిస్తామని, పార్లమెంటులో బిల్లు పెడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపైనా చర్చిస్తున్నామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు సంపత్‌కుమార్, రాంమోహన్ రెడ్డి, మాజీ ఎంపి మల్లు రవి, కోశాధికారి గూడురు నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇలాఉండగా అంతకు ముందు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియా నేతృత్వంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి, కౌన్సిల్‌లోప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ ఎంపి వి. హనుమంత రావు తదితరులు సమావేశమయ్యారు.

చిత్రం..టిపిసిసి కార్యవర్గ సమావేశంలో పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తదితరులు