రాష్ట్రీయం

త్వరలో కాంగ్రెస్ బస్సు యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 70కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లోనే ఎన్నికలు వచ్చేలా వాతావరణం ఉంది కాబట్టి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరిలో బస్సు యాత్రను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే తాత్కాలికంగా యాత్రను నిలిపివేసి, సమావేశాల తర్వాత కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర పాలకుల కళ్ళు నెత్తికి ఎక్కాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై జూన్ 2న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నీటికోసం కాదు కమీషన్ల కోసమే మిషన్ భగీరథ, కాకతీయ పథకాలు చేపట్టారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని మంగల్‌పల్లి గ్రామ టీడీపీ సర్పంచ్ అశోక్‌గౌడ్, పలువురు సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను బాగు చేసుకోవాలన్న ఆకాంక్షతో అనేక మంది తమ పార్టీలోకి వస్తున్నారన్నారు. పోలింగ్ కేంద్రం నుంచి మొదలుకుని రాష్టస్థ్రాయి వరకూ అన్ని కమిటీలను పటిష్టం చేస్తామన్నారు.