రాష్ట్రీయం

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జి. శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. బిజెపితో తాము జత కట్టినట్లు టిడిపి దుష్ప్రచారం చేస్తున్దని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. ఒంటరిగా గెలవలేని టిడిపి ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని ఆయన తెలిపారు. బిజెపితో టిడిపి అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆయన దుయ్యబట్టారు. కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రానీయకుండా డ్రామాలు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్రానికి సహకరిస్తూ ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటులో వెల్ లోకి వెళ్ళి నిరసన తెలపడమే ఇందుకు ఉదాహరణ అని ఆయన తెలిపారు. రాజకీయాల్లో 40 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబుకు కేంద్రంపై పోరాటం ఎలా చేయాలో తెలియదని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ప్రజలకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు.