రాష్ట్రీయం

సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్న గవర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 23: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్.నరసింహన్ శుక్రవారం అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా పుట్టపర్తి చేరుకున్న నరసింహన్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రశాంతి నిలయంలోని శాంతిభవన్ అతిథి గృహానికి చేరుకున్నారు. అనంతరం సాయి కుల్వంత్ సభా మండపంలోకి చేరుకుని అక్కడ ఉన్న సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. బాబా సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి ప్రణమిల్లారు. శాంతిభవన్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం రోడ్డుమార్గం గుండా తిరిగి బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. గవర్నర్‌కు కలెక్టర్ జీ.వీరపాండియన్, ఎస్పీ జీవీజీ.అశోక్‌కుమార్, జిల్లా ఓఎస్‌డీ ఐశ్వర్య రస్తోగి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్, కార్యదర్శి ప్రసాదరావు, కదిరి ఆర్‌డీ ఓ రామ్మోహన్ తదితరులు స్వాగతం పలికారు.