ఆంధ్రప్రదేశ్‌

తీరం దాటిన తీవ్ర వాయగుండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 6: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయగుండం గురువారం ఉదయం 11 గంటల సమయంలో పశ్చిమ బెంగాల్‌లోని డిగా వద్ద తీరం దాటిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియచేశారు. ఈ తీవ్ర వాయుగుండం ఒడిశాలోని బాలాసూర్ వద్ద స్థిరంగా ఉందని, శుక్రవారం మధ్యాహ్నం తరువాత బలహీనపడుతుందని చెప్పారు. దీని ప్రభావం ఏపీపై ఉండదని చెప్పారు. అయితే, ఉత్తర కోస్తాలో పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.