ఆంధ్రప్రదేశ్‌

వైసీపీ అద్దెమైకుగా ఉండవల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 25: పోలవరం పూర్తయితే ప్రతిపక్షాలకు పుట్టగతులుండవనే దురుద్దేశ్యంతోనే బురదజల్లుతున్నాయని, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వైఎస్సార్ కాంగ్రెస్ అద్దెమైకులా అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని ఉంగుటూరు టీడీపీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు పనులు ఇప్పటికే 58.5 శాతం పూర్తయ్యాయన్నారు. దేశంలో ఏ ప్రాజెక్టు ఇంత వేగంగా నిర్మితం కావటంలేదని తెలిపారు. నిరాధారమైన ఆరోపణలుచేసే ఉండవల్లికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. విభజన సమయంలో ఏపీకి న్యాయం చేయాలని నాడు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు పోలవరానికి జాతీయహోదా తెచ్చే విషయంలో ఉండవల్లి పాత్ర ఏమిటో ప్రజలకు తెలుసన్నారు. పోలవరం నిర్మాణంతో రైతుల కడగండ్లు తీర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నారని దాన్ని అడ్డుకోవటం సమంజసం కాదన్నారు. గతంలో హైదరాబాద్‌లో హైటెక్ సిటీని నిర్మిస్తుంటే అసాధ్యమని చెప్పిన కాంగ్రెస్ అది సుసాధ్యం కావటంతో తోక ముడిచిందన్నారు. పోలవరం విషయంలో కాగ్ తప్పు పట్టిన ప్రతి అంశానికి జలవనరులశాఖ సమాధానం ఇచ్చిందని గుర్తుచేశారు. అవినీతికి ఆస్కారంలేకుండా ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయని స్వయాన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర నిపుణుల బృందం ప్రశంసించిన విషయం ఉండవల్లికి తెలియదా అని నిలదీశారు. వైఎస్ హయాంలో జలయజ్ఞం పేరిట రూ 28వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని ఆనాడు కాగ్ తప్పుపట్టిందని నాడు నోరుమెదపని ఉండవల్లి నేడు జగన్‌తో కలసి ప్రాజెక్టును అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు.