ఆంధ్రప్రదేశ్‌

అంతర్జాతీయ సమాజం దృష్టికి... కాకినాడ సీపోర్టు అక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, నవంబర్ 15: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సీపోర్టు కేంద్రంగా జరుగుతున్న అక్రమ వ్యవహారాలను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ పోర్టు కేంద్రంగా జరుగుతున్న నాసిరకం బియ్యం ఎగుమతుల కారణంగా అంతర్జాతీయంగా దేశీయ ఉత్పత్తులకు చెడ్డపేరు వస్తోందన్నారు. ఈ పోర్టు కేంద్రంగా నాసిరకం బియ్యం ఎగుమతి జరుగుతున్నాయనే విషయం తనకు ఒక ఆఫ్రికా దేశం విద్యార్థివల్ల తెలిసిందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో గురువారం పవన్ కళ్యాణ్ విలేఖర్లతో మాట్లాడారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న పోర్టు అధినేత కేవీరావుపై ఆ దేశ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)కు ఫిర్యాదుచేస్తామన్నారు. పోర్టు పేరిట పర్యావరణానికి చేస్తున్న హానిని వారి దృష్టికి తీసుకెళ్తామన్నారు.
విశాఖపట్నంలో ఒక చిన్న థియేటర్ నిర్వహించే కేవీరావు (మెలోడీ వెంకటేశ్వరరావు) కొద్దికాలంలోనే ఒక పోర్టుకు, కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (కెఎస్‌ఈజడ్)కి యజమాని ఎలా కాగలిగారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పోర్టులో కొత్త బెర్తుల నిర్మాణం పేరుతో ఈ ప్రాంత మత్స్యకారులకు ఫిషింగ్ చేసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారన్నారు. అలాగే కాకినాడ నగరానికి తుపాన్లు, ఉప్పెనల నుండి రక్షణ కవచంగా ఉన్న హోప్ ఐలాండ్‌కు కూడా తూట్లు పొడుస్తున్నారన్నారు. దీనివల్ల భవిష్యత్తులో కాకినాడ నగరం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశముందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
కాకినాడ సీపోర్టులో జరుగుతున్న అక్రమాలపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోపోవడం, విపక్ష నేత ప్రశ్నించకపోవడాన్ని బట్టి వారిద్దరికీ ఇందులో భాగస్వామ్యం ఉందని అనుమానించాల్సివస్తుందన్నారు. తక్షణం కేవీ రావును భారత దేశానికి రప్పించి, ఈ వ్యవహారాలపై విచారణ జరపాలని ఆయన డిమాండ్‌చేశారు. తాము అధికారంలోకి వస్తే పర్యావరణానికి, ప్రజాజీవనానికి నష్టం చేకూరుస్తున్న కాకినాడ సీపోర్టుతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని తక్షణం రద్దుచేస్తామని విలేఖర్లు అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ బదులిచ్చారు.
కాకినాడ సీపోర్టు మాత్రమే కాకుండా కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (కేఎస్‌ఈజడ్) పేరుతో గత ప్రభుత్వాలు రైతుల నుండి వేలాది ఎకరాలను సేకరించి, కేవీరావుకు రాసిచ్చేశాయని పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. సెజ్ పేరిట సేకరించిన పంట భూముల్లో పరిశ్రమలు ఏర్పాటుకాకపోతే వాటిని రైతులకు తిరిగిచ్చేయాలన్నారు. విపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబు సెజ్ భూముల్లో ఏరువాక నిర్వహించి, రైతులకు న్యాయం చేస్తానని ప్రకటించి, అధికారంలోకి వచ్చాక మర్చిపోయారన్నారు. తక్షణం కాకినాడ సెజ్ రైతులకు న్యాయం చేయకపోతే సింగూరు తరహా ఉద్యమం వస్తుందన్నారు. అలాంటి ఉద్యమం వస్తే జనసేన రైతులకు అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు.
ముందుగా కాకినాడ సీపోర్టు కారణంగా కలుగుతున్న నష్టాలు, కాకినాడ హోప్ ఐలాండ్‌కు జరుగుతున్న ప్రమాదంపై రూపొందించిన డాక్యుమెంటరీని విలేఖర్లకు ప్రదర్శించారు. ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణకు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చిందని విలేఖర్ల సమావేశంలో పాల్గొన్న శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. విలేఖర్ల సమావేశంలో మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ పాల్గొన్నారు.