తెలంగాణ

మీకిది తగునా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నారని తెలంగాణ టిడిపి క్రమశిక్షణా కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే, టిటిడి మాజీ సభ్యుడు బక్కని నర్సింహులు విమర్శించారు. కాగా, వాస్తవాలు ఏమిటో తెలుసుకోకుండా సినీ నటుడు, జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా మాట్లాడడం సమంజసం కాదని బక్కని నర్సింహులు శుక్రవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. తిరుమలకు సంబంధించిన విషయాలను అనవసరంగా రాద్ధాంతం చేయకుండా ఇంతటితో ముగించాలని ఆయన వారిరువురికీ సూచించారు. రమణ దీక్షితులు ఇటీవల రాష్ట్రంలోని పలువురు నాయకులను కలవడం, అలాగే ఇతర రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులను కలవడం ఆయన ప్రధాన అర్చకత్వానికి మచ్చ తేవడమే అవుతుందని ఆయన అన్నారు.