తెలంగాణ

టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సర్వజన సంక్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబ్బాక, నవంబర్ 9: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మరో సారి ముఖ్యమంత్రిని చేస్తే ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగింపుతో పాటు ప్రజలు కోరుకున్న విధంగా సకల సౌకర్యాలను సమకూర్చుతామని దుబ్బాక తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధి సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గోసాన్‌పల్లి, దుబ్బాక పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పధకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయన్నారు. మిషన్ కాకతీయ, భగీరధ, కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు,ప్రమాద బీమా, పెన్షన్లు, కేసీఆర్ కిట్‌లు, విద్యా వైద్యం వంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేసి ఆదర్శంగా నిలిచారన్నారు. 24 గంటల కరెంటు ఇవ్వడం కేవలం కేసీఆర్‌కే సాధ్యమన్నారు. బీజేపీ అమలు కాని హామీలు ప్రకటిస్తూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తుదన్నారు. కేసీఆర్ నాయకత్వంపై అనవసర ఆరోపణలు చేస్తూ బద్నాం చేసేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.