తెలంగాణ

మాట నిలబెట్టుకోని టీఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టేక్మాల్, నవంబర్ 15: మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో ప్రధాన సమస్య అయన గుండువాగు కాలువను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని అందోల్ కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. బంగారు తెలంగాణ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి తెరాస ప్రభుత్వం ఏమి చేసిందని ఆయన ప్రశ్నించారు. గురువారం మండలం లోని కుసంగిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు నిర్వహించామని, కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో అనేక పథకాలను పొందుపర్చడం జరిగిందన్నారు. అనంతరం ఆయా గ్రామాల నుండి దామోదర్ సమక్షంలో పలువురు కాంగ్రెస్‌లో చేరారు. అచ్చన్నపల్లి, టేక్మాల్, నీలబోయినవాగు, ఎలకుర్తి తదితర గ్రామాల నుండి భారీఎత్తున పలువురు కాంగ్రెస్ చేరారు. వీరికి దామోదర్ కండువాలు వేసి పార్టీలోకి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బాలయ్య, కాంగ్రెస్ నాయకులు యశ్వంత్‌రెడ్డి, టేక్మాల్ అధ్యక్షుడు నిమ్మ రమేశ్, రామకృష్ణారెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.