జాతీయ వార్తలు
రెండోరోజు కొనసాగుతున్న కార్మికుల సమ్మె
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 9 January 2019
న్యూఢిల్లీ: సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా చేపట్టిన కార్మికుల సమ్మె రెండోరోజు కొనసాగుతుంది. కేరళ, పశ్చిమబెంగాల్లో సమ్మె ప్రభావం అధికంగా ఉంది. కేరళలో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ముంబయిలో పౌర రవాణా స్తంభించిపోయింది. కర్ణాటకలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. పశ్చిమ బెంగాల్లో ఆందోళనకారులు బస్సులపై రాళ్లు రువ్వారు. ఓ స్కూలు బస్సుపై రాళ్లు రువ్వారు. ఇదిలావుండగా బస్సు డ్రైవర్లు హెల్మెట్లు ధరించి బస్సులు నడపాల్సిందిగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాదాపు పది కార్మిక సంఘాలు ఈ బంద్కు పిలుపునిచ్చాయి.