సబ్ ఫీచర్

ఎలాంటి విగ్రహాలను ఎంచుకోవాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు మట్టి వినాయకుడిని ఇంట్లో చేసుకోకుండా అందరూ బయట కొనుక్కుని తెచ్చుకుంటున్నారు. బజారులో అమ్మే వినాయకుడిని కొనేటప్పుడు ఏ ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుని కొనాలో ఒకసారి చూద్దాం..
* వినాయక చవితినాడు ఇంట్లో, వినాయక మంటపంపై ప్రతిష్ఠించే విగ్రహం విషయంలో కొన్ని సూచనలు పాటించాలి. సాకారంగా దైవాన్ని ఆరాధించేటప్పుడు ఆ రూపంలో ఏ విధమైన అవయవలోపం లేకుండా శిల్ప సౌందర్యం కలదిగా ఉండాలని శాస్త్రం చెబుతోంది. మట్టితో చేసిన వినాయక విగ్రహాలు చాలా ప్రశస్తమైనవి. లోపల డొల్ల లేకుండా నిండుగా ఉన్న విగ్రహాలను పూజించడం చాలా మంచిది.
* చవితి పూజలో ఏ లోహంతో చేసిన విగ్రహాన్నైనా పూజించవచ్చని పెద్దలు చెబుతారు. అయితే ఇంట్లో పూజించే ప్రతిమ ఆరు అంగుళాల పరిమాణం మించకుండా ఉంటే మంచిది. వినాయక చవితి నాడు పచ్చి మట్టితో చేసిన గణపతి ప్రతిమను ఏర్పాటుచేసుకోవడం బాగుంటుంది. ఆనాడు పార్వతీదేవి నలుగుపిండితో చేసిన చిన్న బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసిన పురాణ కథ ఆధారంగా ఈ విశ్వాసం లోకంలో బలపడింది. అంతేగాక వినాయకుడు మూలాధారానికి అధిపతి అనీ, పృథ్వీ తత్త్వానికి చెందిన వాడని చెప్పే యోగశాస్తర్రీత్యా కూడా ఈ ఆచారం అమల్లోకి వచ్చింది.
* గణపతి నవరాత్రుల్లో పూజించిన విగ్రహాన్ని నిమజ్జనం చేయడమే సంప్రదాయం. అయితే అలా నిమజ్జనం చేయని పక్షంలో మన ఇంటి పెరటిలో ఎవరూ తొక్కకుండా చెట్టుపాదులో ఉంచవచ్చు. బంగారం, వెండి వంటి విలువైన లోహాలతో రూపొందించిన విగ్రహాలను పూజలో ఉంచితే.. నిమజ్జనం రోజు ఉద్వాసన పలికి, తిరిగి యథావిధిగా పూజామందిరంలో ఉంచవచ్చు. పచ్చిమట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడంలో ఒక చిత్రమైన ఆంతర్యం ఉంది. నిమజ్జనం అంటే నీటిలో ముంచడం. అంటే ప్రవాహ జలంలోగానీ, కనీసం ఊరి చెరువులోగానీ నిమజ్జనం చేయాలి. వర్షరుతువులో వచ్చే ఈ పండుగ వేళ పచ్చిమట్టి కోసం మనకు తెలియకుండానే చెరువులకు పూడికలు తీసే పని జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చాడో మళ్లీ అక్కడికే వెళ్తాడు వినాయకుడు. ఈ సత్యం మనకు ప్రబోధించడమే నిమజ్జనంలోని ఆంతర్యం.

ఏకదంతుడు

కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలుపడదని నివారించాడు. ‘పరమేశ్వరుడిని దర్శించుకోకుండా అడ్డుకోవడానికి నీవెవ్వడివి’ అంటూ పరశురాముడు ధిక్కరించాడు. మాటా మాటా పెరిగి అదికాస్తా యుద్ధానికి దారితీసింది. గణపతి తన తొండంతో పరశురాముడిని పైకెత్తి పడేశాడు. పరశురామునికి కళ్ళు బైర్లుకమ్మాయి. ఆగ్రహించిన పరశురాముడు తన చేతిలోని గండ్ర గొడ్డలిని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడిన పార్వతీ పరమేశ్వరులు శయన మందిరం నుంచి బయటకు వచ్చారు. నెత్తురోడుతున్న బాల గణపతిని ఎత్తుకుని పార్వతి పరశురాముడిని మందలించింది. తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నింపమని పరశురాముడు వేడుకున్నాడు. అంతటితో ఆ కథ సమాప్తమైనా గణపతి మాత్రం ఒక దంతం పోగొట్టుకుని ‘ఏకదంతుడు’గా పేరుగాంచాడు.

గరిక ఎందుకు?

గరిక పూజను స్వీకరించడం గణపతి నిరాడంబరత్వాన్ని, ప్రకృతి ప్రియత్వాన్ని సూచిస్తుంది. వినాయకుడిని వివిధ రకాల పత్రాలతో పూజించడం వెనుక ఓ ఆంతర్యం ఉంది. పూజలో వినియోగించే రకరకాల పత్రాల గురించి, వాటిలోని ఔషధ గుణాల గురించి మనకు అవగాహన కల్పించడం ఇందులోని ముఖ్య ఉద్దేశ్యం. అంతేకాదు గరిక.. మట్టితో ఉన్న అనుబంధానికి ప్రతీకగా భావిస్తారు. గరికతో పూజ చేసిన వారిని విశేషంగా అనుగ్రహిస్తానని గణపతి ప్రకటించినట్లు ఓ పురాణ కథనం కూడా ఉంది.

రకరకాలు

మనం వినాయక పూజ చేస్తున్నప్పుడు వినాయక ప్రతిమను ఏయే పదార్థంతో చేసి పూజిస్తే, ఎలాంటి ఫలితం ఉంటుందన్న విషయం పురాతన గ్రంథాలలో చెప్పబడింది.

* మట్టి గణపతిని పూజిస్తే ఉద్యోగంలో ఉన్నతి, వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది.
* పసుపుతో చేసిన గణపతిని పూజిస్తే వివాహ ప్రయత్నాలకు ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి.
* పుట్టమట్టి గణపతిని పూజించడం వల్ల అన్నింటా లాభం కలుగుతుంది.
* బెల్లంతో చేసిన గణపతిని పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయి.
* ఉప్పుతో చేసిన గణపతిని పూజించడం వల్ల శత్రువులపై విజయం ప్రాప్తిస్తుంది.
* వేపచెట్టు కలపతో చేసిన గణపతిని పూజించడం వల్ల శత్రు నాశనం జరుగుతుంది.
* తెల్లజిల్లేడు మొదలుతో చేసిన గణపతిని పూజించడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి.
* వెన్నతో చేసిన గణపతిని పూజించడం వల్ల అన్ని రకాల వ్యాధుల నుండి విముక్తి కలుగుతుంది.
* పాలరాతితో చేసిన గణపతిని పూజించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.
* గంధపు చెక్కతో చేసిన గణపతిని పూజించడం వల్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నతి కలుగుతుంది.
* స్పటిక గణపతిని పూజించడం వల్ల కుటుంబంలో సంతోషం నిలిచి ఉంటుంది.
* నల్లరాయితో చేసిన గణపతిని పూజించడం వల్ల చేసే పనిలో అనవసరపు శ్రమ తొలిగిపోతుంది.

నిమజ్జనం ఎలా చేయాలి?

వినాయక చవితి, దసరా నవరాత్రులు నిర్వహించడం సంప్రదాయం. తొమ్మిదిరోజుల పాటు పూజలు నిర్వహించి, ఆ తరువాత దేవతామూర్తులను నిమజ్జనం చేయడం అనాదిగా వస్తున్నది. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో గణేశ్ నిమజ్జనం ఘనంగా నిర్వహిస్తారు. వినాయక చవితినాడు కానీ 3,5,7,9వ రోజు కానీ నిమజ్జనం నిర్వహించాలి. అంటే బేసి సంఖ్య ఉన్న ఏ రోజైనా స్వామిని నిమజ్జనం చేయవచ్చు. నిమజ్జనం చేసే ముందు గణపతికి భక్తితో ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. తీర్థప్రసాదాలను అందరూ భుజించి ఆ తరువాత సంప్రదాయబద్ధంగా నిమజ్జనం ఊరేగింపు నిర్వహించాలి. నిమజ్జన ఊరేగింపు సమయంలో ఉత్సాహంతో కేరింతలు కొట్టడం, పాటలు, నృత్యాలు సహజమే.. గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో ఎంతో శాస్త్రోక్తంగా పూజ చేసి మరీ ఉత్సవాలను ప్రారంభిస్తాం. మరి నిమజ్జనం చేసే సమయంలో ఎటువంటి సంప్రదాయం పాటించాలి? ఏ మంత్రాన్ని, శ్లోకాన్ని పఠిస్తూ ఆ గణనాథుడ్ని నీటిలోకి వదలాలి? అన్న ప్రశ్నకు దాదాపు ఎవరి దగ్గరా సమాధానం ఉండదు. నిమజ్జన ఉత్సాహ సమయంలో ఈ సంప్రదాయాన్ని పాటించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ సమయంలో శ్లోకాలను చదివి, పూజ చేయాలంటే కష్టం అని అందరూ అనుకుంటారు. అసాధ్యమైన విషయం అయితే కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ గణనాథుడ్ని నీటిలోకి జారవిడిచే ముందు ‘‘శ్రీ గణేశం ఉద్వాసయామి.. శోభనార్థం పునరాగమనాయచ’’ అని చెప్పుకోవడం సంప్రదాయం.