సబ్ ఫీచర్

ఆత్మవిశ్వాసానికి చిరునామా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల అమెరికాకు చెందిన గ్లోబల్ యేవియేషన్ ఫౌండేషన్ సంస్థ విడుదల చేసిన అధ్యయన నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మహిళా పైలెట్లు భారతదేశంలోనే వున్నారన్న గణాంకాలు మన దేశంలో మహిళల సుస్థిర అభివృద్ధికి, మహిళా సాధికారతకు ప్రత్యక్ష నిదర్శనం. సదరు నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా లక్షా ముప్ఫైవేల మంది కమర్షియల్ ఎయిర్ పైలెట్లు ఉండగా, వారిలో మూడు శాతం అంటే సుమారుగా 4 వేలమంది మాత్రమే మహిళా పైలెట్లు వున్నారు. అయితే వీరిలో 525 మంది పైలెట్లు (13 శాతం) భారతీయులే కావడం విశేషం. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా తర్వాత స్థానాలలో వున్నాయి. గోఎయిర్, ఇండిగో సంయుక్త సంస్థలలో అత్యధికంగా 155 మంది పనిచేస్తున్నారు. కాగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 155 మంది మహిళలు వివిధ పైలెట్ శిక్షణా సంస్థలలో శిక్షణ పొందుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
భారతదేశంలో మహిళలు పైలెట్ రంగాన్ని ఎంచుకొని అందులో ప్రపంచ ఖ్యాతి వహించడానికి స్ఫూర్తి సరళా ఠక్రల్ అని చెప్పవచ్చు. ఈమె భారతదేశపు తొలి మహిళా పైలెట్‌గా గుర్తింపు పొందింది. 1914వ సంవత్సరంలో ముంబాయిలో జన్మించిన ఆమెకు చిన్ననాటినుండి సాహస కృత్యాలు అంటే ఎంతో మక్కువ. మహిళలపట్ల వివక్షత, ఆంక్షలు బాగా ఎక్కువగా వున్న నాటి కాలంలో తన 18వ ఏట తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముంబయిలోని పైలెట్ శిక్షణా సంస్థలో చేరి అందులో అద్వితీయ ప్రతిభ కనబరచి 1936లో అంతే తన 21వ ఏట యేవియేషన్ పైలెట్ లైసెన్స్ సంపాదించింది. అనంతరం లాహోర్ ఫ్లయింగ్ క్లబ్‌లో చేరి అచిరకాలంలోనే వెయ్యి ఫ్లయింగ్ గంటలు పూర్తిచేసుకున్న తొలి మహిళగా, భారతీయురాలిగా రికార్డు సాధించింది. 16వ ఏటనే వివాహం అయిన కారణంగా ఆమెకు ఒక పాప కూడా వుంది.
భారత విమానదళంలో పనిచేస్తున్న ఆమె భర్త కెప్టెన్ శర్మ కూడా ఆమెకు అద్భుతమైన ప్రోత్సాహం, సహకారం అందించారు. వీరిద్దరూ కలిసి కొన్ని అరుదైన రికార్డులు సాధించారు. శర్మ అతి అరుదైన ఎయిర్ మెయిల్ పైలెట్ లైసెన్సును, సరళ ఏ గ్రేడ్ లైసెన్సును సాధించిన తొలి భారతీయులు. భార్యాభర్తలిద్దరూ కలిసి వెయ్యి గంటలు సంయుక్తంగా విమానాలు నడిపారు. ఆ కాలంలో భార్యాభర్తలిద్దరూ పైలెట్లు కావడం భారత విమానయాన చరిత్రలోనే ప్రథమం. బ్రిటీషు ప్రభుత్వం ఇంగ్లండ్‌లో నిర్వహించిన పోటీలో సరళ తృతీయ స్థానంలో నిలబడి ప్రపంచ దృష్టి ఆకర్షించింది. సజావుగా సాగుతున్న వారి జీవితంలో అనుకోని దుర్ఘటన సరళ జీవితాన్ని చెల్లాచెదురు చేసింది. 1939లో విమాన ప్రమాదంలో ఆమె భర్త కెప్టెన్ శర్మ మరణించడంతో ఆమెను ఆ వృత్తి వదలివేయాలని అత్తమామలు, తల్లిదండ్రులు, బంధువర్గం శాసించారు. కానీ అంత విషాదంలోను సరళ వారిని ధైర్యంగా ఎదిరించి తన వృత్తి కొనసాగించింది. అయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటీషు ప్రభుత్వం యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించిన కారణంగా ఆమెపై అన్నిరకాల ఒత్తిళ్లు తీసుకువచ్చింది. కమర్షియల్ పైలెట్ లైసెన్సు పరీక్షలో ప్రథమస్థానంలో ఉత్తీర్ణత సాధించినా చిన్న చిన్న కారణాలతో లైసెన్సును ఇవ్వడానికి నిరాకరించింది. దానికితోడు ఇద్దరు అమ్మాయిల కారణంగా కుటుంబ బాధ్యతలు పెరగడంవలన, సమాజం నుండి ఎదురౌతున్న అవహేళన, అవమానాలు, ప్రభుత్వ ఒత్తిళ్ల కారణంగా సరళ తనకిష్టమైన వృత్తిని వదులుకొని లాహోర్‌లో స్థిరపడింది. అక్కడ మాయో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో అధ్యాపకురాలిగా చేరి తనకిష్టమైన పెయింటింగ్, చిత్రలేఖనంలో విద్యార్థులకు చక్కని శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. అక్కడ ఆర్య సమాజ్‌లో సభ్యురాలిగా చేరి నిరంతరం సమాజ సేవ చేస్తుండేది. 1948లో తన తోటి ఆర్య సమాజ్ సభ్యుడైన ఆర్.పి.్ఠక్రల్‌ను వివాహమాడి ముంబయిలో స్థిరపడింది. నాటికాలంలోనే క్రమశిక్షణ, మొక్కవోని ధైర్యసాహసాలతో, వృత్తిపట్ల అంకితభావం, స్వయంశక్తితో అనేక రికార్డులను తిరగరాసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా భారతదేశ కీర్తిపతాకాలను ప్రపంచం నలుమూలా ఎగురవేసిన సరళ ఠక్రల్ 2008 మార్చి 15న తుది శ్వాస విడిచింది. ఆమె జీవితం యావత్ భారత మహిళా లోకానికే స్ఫూర్తిదాయకం .

-- సి. ప్రతాప్