సబ్ ఫీచర్

మహిళల్లో విటమిన్ డి లోపిస్తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో దాదాపు 95 శాతం మంది మహిళల్లో విటమిన్ - డి సరిపడా లేదు. ఐదు శాతం మంది మహిళలకు మాత్రమే తగినపాళ్లలో విటమిన్ - డి అందుతోంది. ఢిల్లీలోని ఎయిమ్స్, ఫోర్టిస్ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు నిర్వహించిన పరిశోధనలో ఈ నిజాలు తెలిశాయి. మనం ఎంతసేపు సూర్యరశ్మిలో ఉంటామన్న దానిపైనే మన శరీరంలోని విటమిన్ - డి ఆధారపడి ఉంటుంది. శరీరంలోని ఎముకలకే కాకుండా, శరీర రోగనిరోధక శక్తికి కూడా సూర్యరశ్మి చాలా అవసరం. భారతదేశంలో ఎక్కడా సూర్యరశ్మి సమస్య లేదు. అయినప్పటికీ మహిళలు విటమిన్ - డి లోపంతో బాధపడుతున్నారంటే ఇది ఆలోచించాల్సిన విషయమే..
* భారతీయ మహిళల్లో చాలామంది ఇంటిపనులకే పరిమితం అవుతారు కాబట్టి వారికి అందే సూర్యరశ్మి చాలా తక్కువ.
* రెండోది భారతీయ మహిళలు ధరించే దుస్తులు. చాలామంది మహిళలు చీర లేదా చుడీదార్ ధరిస్తారు. ఇవి వాళ్ల శరీరంలో ఎక్కువ భాగాన్ని కప్పేస్తాయి. విటమిన్ - డి లోపానికి ఇది కూడా ఓ కారణం.
* మూడోది ఏంటంటే.. మహిళల్లో వచ్చే హార్మోన్ మార్పులు.. పిల్లలకు పాలిచ్చే దశలో, మెనోపాజ్ తరువాత మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
సూర్యరశ్మి అందకపోవడం వల్లే విటమిన్ - డి లోపం ఏర్పడుతుందని చాలామంది భావిస్తారు. అయితే.. అదొక్కటే కారణం కాదు. మనం తినే ఆహారంలో రిఫైన్డ్ ఆయిల్ ఉపయోగిస్తే.. దానివల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ పదార్థాలు శరీరంలో విటమిన్ - డి ఏర్పడటంలో చాలా ముఖ్యపాత్ర పోషిస్తాయి. అందువల్ల విటమిన్ - డి లోపం ఏర్పడుతుందని డాక్టర్లు వివరిస్తున్నారు. రిఫైన్డ్ అయిల్లో ట్రాన్స్‌ఫాట్ అధికంగా ఉంటుందట. ఇది శరీరంలోని మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గించి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుందట. అందువల్ల వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి మహిళలు వంటల్లో రిఫైన్డ్ ఆయిల్ ఉపయోగించకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే బదులుగా నెయ్యి, ఆవనూనెను ఉపయోగించడం మొదలుపెట్టవచ్చు అని చెబుతున్నారు.
ఎంత ఉండాలి?
మిల్లీలీటర్ రక్తంలో 75 నానోగ్రాముల విటమిన్ - డి ఉంటే అది సరైన పాళ్లలో ఉన్నట్లు లెక్క. అదే 50 నుంచి 75 నానోగ్రాములు ఉంటే విటమిన్ - డి తగినంత లేదని భావిస్తారు. మిల్లీలీటరుకు 50 నానోగ్రాముల కన్నా తక్కువ ఉంటే దాన్ని విటమిన్ - డి లోపంగా పరిగణిస్తారు. ప్రస్తుతం భారతదేశ మహిళల్లో విటమిన్ - డి కేవలం మిల్లీలీటరు రక్తంలో 5 నుంచి 20 నానోగ్రాములు మాత్రమే ఉంది. డాక్టర్ల అంచనా ప్రకారం 95 శాతం మంది భారతీయ మహిళలు విటమిన్ - డి లోపంతో బాధపడుతున్నారు. అయితే విటమిన్ - డి లోపం కేవలం మహిళల్లో మాత్రమే కాదు, పురుషుల్లోనూ ఉంది. అయితే మహిళలతో పోలిస్తే అది చాలా తక్కువ.
సూచనలు
* త్వరగా అలసిపోవడం
* కీళ్లనొప్పులు
* పాదాలు వాయడం
* ఎక్కువసేపు నిలబడలేకపోవడం
* కండరాల బలహీనత
ఇవన్నీ విటమిన్ - డి లోపానికి సూచనలు. అయితే వీటిని చాలామంది పట్టించుకోరు. విటమిన్ - డి లోపం క్రమక్రమంగా శరీర భాగాలన్నింటినీ బలహీనపరుస్తుంది. దీంతో వృద్ధాప్యంలో ఎముకలు, కీళ్లు, కండరాల నొప్పులు మరింత ఎక్కువవుతాయి.
నష్టాలు
విటమిన్ - డి లోపం వల్ల శరీరంలో కాల్షియంను సంగ్రహించే సామర్థ్యం తగ్గిపోతుంది. ఫలితంగా ఎముకలు, కండరాలు, కీళ్లనొప్పులు ఎక్కువవుతాయి. ఎముకలు విరిగే అవకాశాలు పెరుగుతాయి. భారతదేశంలో చేసిన పరిశోధనలో విటమిన్ - డి లోపం ఉన్న మహిళలకు ఎక్కువగా మధుమేహ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వెల్లడైంది. ఇక అంతర్జాతీయ పరిశోధనల విషయానికి వస్తే, బ్రిటన్ జర్నల్ ‘న్యూరాలజీ’ విటమిన్ - డి లోపం వల్ల వృద్ధుల్లో డిమెన్షియా వచ్చే అవకాశం పెరుగుతుందని తెలిపింది.
నివారణ
ఎయిమ్స్‌ల డాక్టర్లు చెప్పినదాని ప్రకారం కేవలం ఆహారం ద్వారా విటమిన్ - డి లోపాన్ని పూరించలేం. అతి తక్కువ దుస్తులతో ఎండలో నడవడం, విటమిన్ - డిని మాత్రల రూపంలో తీసుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం అని సారాంశం. కానీ భారతదేశంలో ఇది సాధ్యం కాదు. దీనికి నిర్దిష్టమైన ఫార్ములా అంటూ ఏమీ లేకున్నా రోజూ ఒక గంట పాటు సూర్యరశ్మి తగిలితే విటమిన్ - డి లోపం పరిష్కారం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఉదయం లేదా సాయంత్రం సూర్యరశ్మి అయితే మేలని డాక్టర్లు చెబుతున్నారు. నోటిద్వారా తీసుకునే మాత్రలు కూడా విటమిన్ - డి లోపాన్ని అధిగమించడానికి దోహదపడుతాయి.