సబ్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకవేళ నాతడు తన వాగ్దానమును మఱచినను తద్వ్యతిరిక్తముగా వర్తింపనాతని మనశ్శరీరములే నిరాకరించి విషయమును జ్ఞప్తికిదెచ్చెడివి. జగజ్జననికి సర్వము తానర్పించినను సత్యమును మాత్రమర్పింప జాలనైతివనియు, సత్యము నర్పించినచో తనయాత్మార్పణమే అసత్యమైపోవుననియు నాతడు వచించెను. నిజముగా ఆతని గంభీర వ్యక్తిత్వమును బరిశీలించినచో అందు సుగుణరత్న రాసులనంతముగా గాన్పించును.
జగద్గురువు
కల్యాణ గుణములకు పెన్నిధానమగు శ్రీరామకృష్ణుని జీవితము లోకమునకెట్టి మేల్కొనగూర్చెనో మనమిక గమనింపవలసియున్నది. శ్రీరామకృష్ణుని జగద్గురుత్వ మీవఱకే ప్రారంభమైనను 1875-వ సంవత్సరమున నాతడు బ్రాహ్మ సమాజ మహానాయకుడగు కేశవ చంద్రసేనుని గలిసికొనిన నానుండియు నాతనియుపదేశామృతము లోకమున నవిచ్ఛిన్నముగా బ్రసరింపసాగెను.
అతని యసమానప్రతిభను - అద్వితీయాన్నత్యమును- గూర్చి మహావక్తయు సుప్రసిద్ధతత్త్వవేత్తయు నగు కేశవచంద్రసేనుడు తన మహోపన్యాసములచే, రచనములచే, లోకమునకు జాటనారంభించెను. అంతట కలకత్తాపౌరులు, ముఖ్యముగా విద్యాధికులు, ఆబాలవృద్ధము తీర్థ ప్రజవలె శ్రీరామకృష్ణ సందర్శనార్థమై రాసాగిరి.
ప్రతాపచంద్ర మజుందారు, శివనాథశాస్ర్తీ, విజయ కృష్ణగోస్వామి, దేవేంద్రనాథ ఠాకూరు, ఈశ్వర చంద్రవిద్యాసాగరుడు, బంకిమ్‌చంద్ర చట్టోపాధ్యాయుడు, మైకేల్ మధుసూదనదత్తు, అశ్వినికుమారదత్తు, గిరిశ చంద్రఘోషు మున్నగు నాటి సుప్రసిద్ధ వ్యక్తులనేకులు శ్రీరామకృష్ణుని సందర్శించి, యాతని యెడ నఖండ పూజ్యభావమును వహించి, లోకమునకు బ్రకటింపసాగిరి.
ఇటులాతని సందర్శించిన ముముక్షువులలోననేకులు క్రమముగా నొకభక్త బృందమై వెలసిరి. కాలాంతరమున వీరే శ్రీరామకృష్ణుని సందేశమును దేశదేశాంతరములలో వ్యాప్తమొనర్చిన ధన్యాత్ములు. సంసారులైయున్న పెద్దలు, సంసార బంధమునింకను బైవైచుకొనని యువకులు- విద్యార్థులు- ఇటులీబృందమున నిరు తెగల వారుండిరి.
ఇందుగొందఱు బాలురు. ఈ సమయమున నరేంద్రనాథ దత్తు అనబఱగిన శ్రీవివేకానందస్వామి నాయకత్వమున వీరలే కాలాంతరమున శ్రీరామకృష్ణాశ్రమ సన్న్యాసులై గురుసందేశ ధర్మజ్యోతిని బ్రజ్వలింప జేయసాగిన యతీంద్రులు. నరేంద్రనాథుడు ఈ బాల శిష్య బృందమున శ్రీరామకృష్ణునకత్యంత ప్రీతిపాత్రుడై, అఖండానుగ్రహపాత్రుడై కాలక్రమమున వివేకానందుడై గురుసందేశమును ప్రాక్పశ్చిమ ఖండములందంటను వ్యాప్తియొనర్చిన మహనీయుడు. తన యఖండ సేవలచే నవీన భారతదేశమున ఈ యతీశ్వరుడు నూతనోత్తేజమును నూతన చైతన్యమును బ్రభవింపజేసి దేశభక్తాగ్రగణ్యుడై సిలసిల్లెను.
శ్రీరామకృష్ణుడు తన జీవిత శేషమును ఈ భక్తబృందమునకు బోధించుటకై- వారల జీవనవిధానమును మహోన్నతాదర్శదీప్తి మొనరించుటకై- వినియోగింపసాగెను. శిష్యుల కాతడాప్తబంధువు, ప్రాణమిత్రుడు. తాను గురుడనని యాతడు కలనైనను దలచి యెఱుగడు. జగజ్జనని చేతిలో తాను కేవలము ఉపకరణమనని యాతడు భావించెను. ఇట్టి సంపూర్ణాత్మార్పణము వలననే ఆచార్యశక్తి యాతనియందఖండముగా ప్రకాశితము కాసాగెను. ఆతని సాన్నిధ్యమునుబొందిన సర్వము పవిత్రమై, మహనీయమై వఱలెను. పరుస వేదితాకున నినుము బంగారమగునట్లు పతితులాతని సంసర్గ ప్రభావమున పావనులై యొప్పిరి.
ఇంకా ఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి