సబ్ ఫీచర్

పర్యాటక రంగానికి కొత్త ఊపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగం కొత్తపుంతలు తొక్కుతూ సందర్శకులకు ఆహ్లాదం కలిగిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ‘విజన్’కు అనుగుణంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగం విస్తరిస్తోంది. సహజ సిద్ధంగా ఉన్న అన్ని అవకాశాలను పర్యాటక శాఖ సద్వినియోగం చేసుకుంటోంది. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు వివిధ ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆధ్యాత్మిక పర్యాటకం, గ్రామీణ పర్యాటకం, సముద్రతీర పర్యాటకం, వినోద పర్యాటకం.. ఇలా అన్ని వైపులా ఈ శాఖ విస్తరిస్తోంది.
పుణ్యక్షేత్రాలు, పురాతన దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు, నదులు, కాలువలు, సెలయేర్లు, సుందర ప్రదేశాలు, సముద్ర తీరాలు పర్యాటకులకు ఆహ్లాదం కలిగించేలా రూపుదిద్దుకుంటున్నాయి. నదులలో భద్రతతో కూడిన బోటు షికారుకు ఏర్పాట్లు చేశారు. పర్యాటకులకు కావలసిన హోటళ్లు, వినోద కేంద్రాలు, రోడ్లు, అతిధి గృహాలు.. వంటి వౌలిక సదుపాయాలు ఏపీ ప్రభుత్వం సమకూరుస్తోంది. దేశ, విదేశీ పర్యాటకులకు ఆంధ్ర వంటకాల రుచి చూపిస్తున్నారు. గ్రామీణ పర్యాటకాన్ని అభివృద్ధి చేసే క్రమంలో నూతనంగా చేపట్టిన ‘సంస్కృతి’ ప్రాజెక్టుకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. భారతీయ జీవనం, రాష్ట్రంలో పలు ప్రాంతాల సంస్కృతి, కళల అభివృద్ధికి పర్యాటక శాఖ అనేక చర్యలు చేపట్టింది. తెలుగు సంస్కృతి, తెలుగు నృత్య రీతులు, తెలుగు వంటలు, తెలుగు పండుగలే గాక హరికథ, బుర్రకథ, ఒగ్గుకథ, కోలాటం, థింసా నృత్యం వంటి కళలతోపాటు వారసత్వంగా వచ్చే కళల పునరుజ్జీవానికి స్థానిక కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. కళల పరిరక్షణ దిశగా పర్యాటక శాఖ మంచి ఫలితాలను సాధిస్తోంది. రాష్ట్ర విభజన తరువాత ఈ రంగం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకుముందు ఎన్నడూ లేని రీతిలో రాష్ట్ర బడ్జెట్‌లో తగినంతగా నిధులు కేటాయిస్తున్నందున పర్యాటక రంగం విస్తృత స్థాయిలో అభివృద్ధి చెందుతోంది.
పర్యాటక శాఖ చేపట్టే అంతర్జాతీయ ఈవెంట్లు, సోషల్ మీడియా సమ్మిట్, ఎఫ్1హెచ్2ఓ బోట్ రేసింగ్, ఎయిర్ షో, బెలూన్ ఫెస్టివల్, బీచ్ ఫెస్టివల్ వంటివి ప్రజలలో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతోంది. ఏపీ రాజధాని అమరావతిని కూడా పర్యాటకులను ఆకర్షించే రీతిలో రూపొందిస్తున్నారు.
దేశంలో 13 శాతం మేరకు అంటే రాష్ట్రంలో 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తీరం వెంట భూగర్భంలో నిక్షిప్తమై వున్న అపారమైన ఖనిజ సంపద పరిశ్రమల నిర్మాణానికి, పోర్టులు ఎగుమతులు, దిగుమతులకు ఉపయోగపడటంతోపాటు బీచ్ టూరిజానికి మార్గం సుగమమైంది. ప్రభుత్వం కూడా ఆ దిశగా అనేక కార్యక్రమాలు రూపొందించింది. ఈ రంగంలో ఆర్థిక వృద్ధి రేటుకూడా గణనీయంగా పెరుగుతోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 6.96 శాతం వున్న అభివృద్ధి సూచీ రాష్ట్రం చేపట్టిన విప్లవాత్మక అభివృద్ధి చర్యలతో 2017-18 ఆర్థిక సంవత్సరానికి 11.22 శాతం అభివృద్ధి సూచికను చేరుకుంది. ఆధ్యాత్మిక పరంగా ప్రాధాన్యత కలిగిన కృష్ణా, గోదావరి నదుల సంగమ ప్రాంతాన్ని సందర్శకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా కృష్ణానదికి మహర్దశ కలిగింది. విజయవాడ నగరంలో కృష్ణా నదీ తీరాన అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. భవానీ ద్వీపాన్ని అన్ని సౌకర్యాలతో పర్యాటకులను ఆకర్షించే విధంగా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. పర్యాటక ఆస్తులకు సంబంధించిన పూర్తి సమాచారం భద్రపరిచే ఏర్పాటు చేస్తున్నారు. గండికోటలో ఏర్పాటు చేయదలచిన ఎడ్వెంచర్స్ అకాడమీ పనులను డిసెంబర్ చివరి వారంలో ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించారు. ఏపీ పర్యాటక శాఖకు చెందిన వెబ్‌సైట్‌లో పర్యాటక పండుగలకు సంబంధించిన సమాచారం డిజిటల్ క్యాలెండర్ రూపంలో అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటకుల సౌకర్యార్థం ఆధునికమైన ఓల్వో బస్సులను ప్రవేశపెట్టింది. పూణె, కోల్‌కతా, ముంబయి, న్యూఢిల్లీ, జైపూర్, హైదరాబాద్, మైసూర్‌లలో మాదిరి పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. పర్యాటక శాఖ భాగస్వామ్యంతో మహీంద్ర జూమ్ కార్లను ఇప్పటికే ప్రవేశపెట్టింది. ఎవరికివారు డ్రైవింగ్ చేసుకునేలా ఏర్పాటుచేసిన ఈ బ్యాటరీ అద్దె కార్లు గన్నవరం విమానాశ్రయం, విజయవాడ బెంజ్ సర్కిల్, సచివాలయం వద్ద అందుబాటులో ఉంచుతారు. తెలుగు సంస్కృతిలో అంతర్భాగంగా వున్న ఆహారం గురించి నేటి తరంతోపాటు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పర్యాటకులకు పరిచయం చేయాలన్న ఆలోచనతో ఆ శాఖ ఆంధ్ర ఫుడ్ ఫెస్టివల్ పేరుతో ఆహార పండుగలు నిర్వహిస్తోంది.
తపాలా శాఖ అందిస్తున్న ‘మై స్టాంప్’ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రంలోని పనె్నండు పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక తపాలా బిళ్లలను విడుదల చేసింది. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగానూ పర్యాటక ప్రాంతాలు మరింతగా జన బాహుళ్యంలోకి వెళ్ళేలా చేస్తోంది. పర్యాటక రంగ పరంగా రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులవల్ల వివిధ జాతీయ, అంతర్జాతీయ స్థాయిసంస్థలు పర్యాటక శాఖకు అవార్డులు అందిస్తున్నాయి. ఈ క్రమంలో పర్యాటక రంగంలో సమగ్ర అభివృద్ధిని సాధించిన రాష్ట్రంగా వరుసగా రెండేళ్లు రాష్ట్ర పర్యాటక శాఖకు అరుదైన గౌరవాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా ‘ఇండియా టుడే’ పత్రిక ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన కాన్‌క్లేవ్‌లో ఏపి టూరిజం దేశంలోనే అత్యుత్తమంగా నిలిచిందని కొనియాడుతూ పర్యాటక రంగంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రం అవార్డును పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియకు ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు అందజేశారు. పర్యాటక ప్రాజెక్టులను వేగవంతం చేయడం కోసం ఏక గవాక్ష విధానాన్ని మరింత సరళీకరించి, పటిష్టపరిచారు. పర్యాటక పెట్టుబడిదారులు తమ అనుమతుల కోసం వివిధ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఎదురుకాకుండా ఈ విధానం ఉపయోగపడుతుంది. ప్రభుత్వం కల్పించే సౌకర్యాలవల్ల ఈ రంగంలో పెట్టుబడులు కూడా భారీగా పెరుగుతున్నాయి. పలు ప్రాజెక్టులకు సంబంధించిన పనులను ఇప్పటికే మొదలుపెట్టారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపడుతున్నాయి.

-శిరందాసు నాగార్జున 94402 22914