సబ్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

36.మూడు బొమ్మలున్నవి- ఓకటి ఉప్పుతో జేసినది, రెండవది గుడ్డతో జేసినది, మూవడది రాతితో జేసినది, ఈ బొమ్మలను నీటిలో ముంచినయెడల మొదటిది కరిగిపోయి రూపనాశనము నొందును;రెండవది చాలనీటిని పీల్చుకొనును, కాని ఆకృతి పోగొట్టుకొనదు;మూడవది నీటడిని తనలో చొరనీయదు. ఆత్మను పరమాత్మలో లయించి ఐక్యమొందిన జీవుడే ఇందు మొదటిబొమ్మ. బ్రహ్మజ్ఞానానందమయుడగుభక్తుడే ఇందలి రెండవ బొమ్మ. తనహృదయమున తత్త్వజ్ఞానమునకు అణుమాత్రమైన అవకాశమీయని శుద్ధ లౌకికుడు ఇందలి మూడవ బొమ్మ.
37.మానవులు తలగడదిండ్ల గలేములవంటివారు.ఒక గలేబు ఎర్రగా నుండవచ్చును. మరియొకటి నీలముగా నుండవచ్చును, వేరొకటి నల్లగా నుండవచ్చును; కాని అన్నింటిలో నుండునది దూదియే కదా! మానవుల విషయము కూడా నిట్టిదే. ఒకడు చక్కనివాడు, మరియొకడునల్లనివాడు, ఇంకొకడు పావనుడు, వేరొకడు పాపాత్ముడు. ఐనను అందరియందును ఒకే పరమాత్ముడు నెలకొని యున్నాడు.
38.మోదకములపై పూత వరిపిండియే, కాని లోపలి పూర్ణము పలు విధములుగా నుండును. మోదకముల బాగోగులు అందలి పూర్ణము ననుసరించి యుండును. అటులనే నరులందరిశరీరమును పంచభూములచేతనే నిర్మాణమై యున్నను చిత్తశుద్ధిని బట్టి వారు వేర్వేరు గుణములు గలవారుగా నుందురు.
39.బ్రాహ్మణ కుమారుడు జన్మముచే బ్రాహ్మణుడే. కాని యిట్లు బ్రాహ్మణులై పుటిటనవారిలో గొందరు పండితులగుచున్నారు. కొందరు పురోహితులగుచున్నారు. మరికొందరు వంట బ్రాహ్మణులగుచున్నారు. ఇంక గొందరు భోగకాంతల యింటిముంగిట ధూళిలో బడి పొరలాడుచున్నారు.
40.పులిలో సైతము దేవుడు ఉండుట నిజమే, కాని అందుచే మనము ఆ జంతువునకెదురుగా బోయి నిలువవచ్చునా? పరమ దుర్మార్గులందును భగవంతుడుండుట నిజమేయైనను మనము వారి సహవాసము చేయుట పాడిగాదు.
41.నీరు అంతయు నారాయణస్వరూపమే. కాని అన్నిరకముల నీళ్లును త్రాగుటకు నికిరావు. అటులనే భగవంతుడు సర్వాంతర్యామియై యుంట నిజమే. అయినను సర్వప్రదేశములును మనము దర్శింపదగినవి కావు. ఒకరకము నీరు కాళ్ళు కడుగుకొనుటకు మాత్రము ఉపయోగించును. వేరొకరీతి నీరు స్నానమును పనికివచ్చును, మరొక రీతి నీరు త్రాగుటకు వినియోగించును. కొన్ని రకముల నీరు తాకుటకుకూడా పనికిరాకుండును. అట్లే స్థలములను బహవిధములుగానున్నవి. కొన్నిటి సమీపమునకు బోదగును. కొన్నిటిని దర్శింపనగును; కొన్నిటిని దూరమునుండియే ‘సలాము చేసి’ పోదగినవిగా నున్నవి.
42.ఈ దిగువ చెప్పబడినవారి విషయమున మెలకువ గలిగి వర్తింపుడు. 1.హద్దుపద్దు లేకుండా సదా వాగుచుండువాడు 2.కపట హృదయుడు 3.చెవులకు తులసిదళమును తగిలించుకొని తన భక్తి నెల్లరకును బ్రదర్శించువాడు. 4.పెద్ద మేలిముసుగు వేసికొను స్ర్తి, 5.మిగుల ననారోగ్యకరమగు పాచితో నిండియున్న మఱుగుగుంటలోని చల్లని నీరు.
మరణము :పునర్జన్మము
43.బద్ధజీవులు అవసానకాలమున గూడా సంసారపు గొడవలను గూర్చియే మాటలాడుదురు. నరుడు తీర్థయాత్రలు చేసియుండుగాక, గంగాస్నానము గావించియుండుగాక, తావళము బూని జపించి యుండుగాక, హృదయమున రాగద్వేషములున్నంతవరకు మరణకాలమున అవి వెలువడక మానవు. ఆ సమయమున సంధిలో లౌకిక ప్రలాపములనే సాగింతురు (బద్ధజీవులు). (పెంపుడు) చిలుక సాధారణమగు రాధాకృష్ణనామమును గానము చేయవచ్చును; కాని పిల్లి నోట చిక్కినప్పుడు కీచుకీచుమనుచు స్వాభావికవు గూతతోడనే ఏడ్చునుగదా!
44.దైవభక్తి లేకపోవుటయే మానవుని అపరమిత బాధలన్నింటికిని కారణము. కావున నరుడు అవసాన కాలమున నారాయణ స్మరణకు తోడ్పడునట్టి సాధన చేయవలయును.
ఇంకావుంది...

శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి