సబ్ ఫీచర్

ఇద్దరు ‘చంద్రులు’ కలిస్తే అద్భుతమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాబోయే లోక్‌సభ ఎన్నికల తర్వాత మన దేశానికి ప్రధాని ఎవరు? నరేంద్ర మోదీ కాకుంటే- ఆ పీఠాన్ని ఎక్కేదెవరని యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన మన దేశంలో ఇప్పటికీ రెండే రెండు ప్రధాన పార్టీలు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి నుంచి రాహుల్ గాంధీ, భాజపా నాయకత్వంలోని ఎన్డీఏ శిబిరం నుంచి నరేంద్ర మోదీ ప్రధాని పదవి కోసం ప్రస్తుతం పోటీలో ఉన్నట్టు అంతా భావిస్తున్నారు. ప్రస్తుత ప్రధాని మోదీ మళ్లీ పగ్గాలు చేపట్టడం ఖాయమని భాజపా ధీమాగా ఉంది. ఇటీవల ఎన్డీఏ కూటమి నుండి నిష్క్రమించిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టడం అనూహ్య రాజకీయ పరిణామాలకు నాంది పలికింది. గత నెలలో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కూటమి రాబోయే లోక్‌సభ ఎన్నికల వరకూ కొనసాగుతుందా? లేదా? అన్న చర్చ ఇపుడు ఊపందుకొంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాకూటమి ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారు.
ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచిన తెరాస అధినేత కేసీఆర్ సైతం జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో తాము కీలకపాత్ర పోషించడం ఖాయమని ఆయన అంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి కొత్తఫ్రంట్ ఏర్పాటు చేయాలన్నది కేసీఆర్ సంకల్పం. కాంగ్రెస్సేతర, భాజపాయేతర పార్టీలతో కూటమిని ఏర్పాటు చేసి కేంద్రంలో అధికారం దక్కించుకోవాలన్నది ఆయన వ్యూ హంగా కనిపిస్తోంది. తెలంగాణలో గత నాలుగున్నరేళ్ల కాలంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలపై ఇతర రా ష్ట్రాలు సైతం ఆసక్తిని చూపుతున్నాయి. రైతుబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని కేసీఆర్ చెబుతుండడంతో తెరాస పాలనను మిగతా రాష్ట్రాలు సైతం గమనిస్తున్నాయి. కాంగ్రెస్, తెదేపా, భాజపా, వామపక్షాలను ఓడించి భారీ మెజారిటీతో కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావడంతో జాతీయ రాజకీయాల్లో ఇక తెరాస కీలకపాత్ర వహించగలదన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. తెరాస పార్టీ పగ్గాలను తన కుమారుడు కేటీఆర్‌కు అప్పగించి, జాతీయ రాజకీయాలపై దృష్టి సారించేందుకు కేసీఆర్ సమాయత్తం కావడం గమనార్హం. ఇప్పటికే ఆయన వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ పలు ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు ప్రారంభించారు.
దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత ఉత్తర భారతదేశానికి చెం దిన నాయకులే ఎక్కువగా ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారు. దక్షిణ భారతం నుంచి అందునా తెలంగాణ ప్రాంతానికి చెందిన పీవీ నరసింహారావు మాత్రమే అనుకోని రీతిలో ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రాభవం క్రమేణా తగ్గడంతో తెలుగు ప్రజలు ప్రాంతీయ పార్టీలకే పట్టం గడుతున్నారు. సినీనటుడు ఎన్టీ రామారావు అలనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి కొన్ని నెలల వ్యవధిలోనే అధికారం చేపట్టారు. జాతీయ రాజకీయాల్లోనూ ఆయన చక్రం తిప్పారు. ఎన్టీఆర్ తర్వాత 1996లో చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో పార్టీలను కూడగట్టడంలో విజయం సాధించారు. రాజకీయంగా ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటూ చంద్రబాబు ముందుకు వెళతారు. రాజకీయంగా ఒడిదుడుకులు లేకుంటే గతంలో ఎన్టీఆర్ ప్రధాని అయ్యేవారని విశే్లషకులు చెబుతుంటారు. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే గనుక చంద్రబాబుకు భవిష్యత్‌లో ఉన్నత పదవులు దక్కే అవకాశాలున్నాయి. ఇక, రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా విశేష జనాదరణ ఉన్న నేత. అకాల మరణం పొందక ఉంటే ఆయన కూడా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి ఉండేవారు. ప్రస్తుత రాజకీయాలను గమనిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి కేసీఆర్, చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో సత్తా చాటేందుకు ఇపుడు వ్యూహరచన చేస్తున్నారు. భిన్నధృవాలుగా ఉన్న ఈ ఇద్దరు నేతలూ ఒక్కటైతే తెలుగు ప్రజలు జాతీయ రాజకీయాలను శాసించే పరిస్థితి రావడం ఖాయం. దక్షిణ భారతానికి మరోసారి ప్రధాని పీఠం దక్కాలంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ ఐక్యంగా పనిచేయడం అవసరం అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అవకాశాన్ని జారవిడుచుకొంటే ప్రధాని పదవి దక్షిణ భారతానికి దక్కడం ఇప్పట్లో సాధ్యం కాదని చెప్పొచ్చు.

-డా. పోలం సైదులు 94419 30361