సబ్ ఫీచర్

పెయన్ కిల్లర్స్ వాడకూడదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడుపుతో ఉన్నవారు నొప్పిని తగ్గించే మాత్రలు వాడకూడదు. ఫలితంగా పుట్టబోయే పిల్లలకు సంతానోత్పత్తి సమస్యలొస్తాయని తాజా అధ్యయనం చెబుతోంది. గర్భిణులు పెయన్ కిల్లర్స్ వాడటం వల్ల.. దాని ప్రభావం పుట్టబోయే పిల్లల డీఎన్‌ఏపై ఉంటుందని, భవిష్యత్తు తరాల సంతానోత్పత్తిపై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఎడిన్‌బరో యూనివర్శిటీ అధ్యయనం వివరించింది. కడుపుతో ఉన్న సమయంలో మహిళలు పారాసిటమాల్ వంటి మందులను వాడకూడదని డాక్టర్లు చెబుతుంటారు. తాజా అధ్యయనం ఈ వాదనలను బలపరుస్తోంది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం.. పారాసిటమాల్‌ను గర్భిణులు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వాడాలి. అది కూడా వీలైనంత తక్కువ కాలం వాడాలి. కానీ ఐబ్యుప్రోఫెన్‌ను వాడటం పూర్తిగా మానేయాలి.
మెనోపాజ్
ప్రయోగశాలల్లో మానవ కణజాలాలపై పలురకాల పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో దాదాపు ఒకేరకమైన ఫలితాలను గుర్తించారు. మనుషులపై డ్రగ్స్ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోడానికి.. మానవ కణజాలంపై ఓ వారం రోజుల పాటు డ్రగ్స్‌ను ప్రయోగించారు. ఈ పరిశోధనల్లో.. వీర్యం, పిండం, శరీర కణాల అభివృద్ధికి తోడ్పడే బీజకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడాన్ని శాస్తజ్ఞ్రులు గుర్తించారు. ఓవరీస్‌పై వారంరోజులపాటు పారాసిటమాల్‌ను ప్రయోగించగా.. పిండోత్పత్తి కణాల సంఖ్య నలభై శాతానికి పడిపోయింది. ఈ కణాల సంఖ్య గణనీయంగా పడిపోవడం వల్ల మహిళల్లో మెనోపాజ్ దశ ముందుగా వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
మగపిల్లలపైనా..
పిండం అభివృద్ధి చెందుతున్న దశలో పెయిన్ కిల్లర్స్ వాడకం.. మగసంతానంపై కూడా దుష్ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం చెబుతోంది. పురుషుల వృషణ సంబంధమైన కణజాలంపై కూడా ఇలాంటి పరిశోధనలే చేశారు. ఈ కణజాలంపై పారాసిటమాల్, ఐబ్యుప్రోఫెన్‌లను విడివిడిగా ప్రయోగించారు. రెండు సందర్భాల్లోనూ.. వీర్యాన్ని ఉత్పత్తి చేసే కణాల సంఖ్య 25 శాతానికి పడిపోవడం శాస్తజ్ఞ్రులు గుర్తించారు. పెయిన్ కిల్లర్స్ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వీరు ఎలుకలపై అధ్యయనం చేశారు. వృషణ కణజాలం కలిగిన ఎలుకలపై సగటు మనిషి వాడే పారాసిటమాల్ డోసును ఒక రోజు పాటు ప్రయోగించారు. వీర్యాన్ని ఉత్పత్తిచేసే కణాల సంఖ్య 17 శాతానికి పడిపోయింది. అలా వారం రోజులపాటు ప్రయోగించాక.. ఆ కణాల సంఖ్య మూడో వంతు తగ్గిపోయింది. ఎలుకలపై చేసిన అధ్యయనాల్లో పెయిన్ కిల్లర్స్‌ను వాడటం వల్ల బీజకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం, ఆ కారణంగా పుట్టబోయే ఆడపిల్లల్లో సంతానోత్పత్తిలో సమస్యలు తలెత్తుతాయని శాస్తజ్ఞ్రులు కనుగొన్నారు. అయితే పారాసిటమాల్ లేదా ఐబ్యుప్రోఫెన్ వాడకం వల్ల డీఎన్‌ఏ వ్యవస్థలో మార్పులు జరుగుతాయన్న అంశం వెలుగులోకి వచ్చింది. దీన్ని 3ఎపిజెనెటెక్ మార్క్స్2 అంటారు. ఓవరీస్, వృషణాల పనితీరులో కీలకమైన ప్రొస్టాగ్లాండిన్స్‌పై పెయిన్ కిల్లర్స్ ప్రభావం చూపుతాయని అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనాన్ని 3 ఎన్విరానె్మంటల్ హెల్త్ పర్స్పెక్టివ్స్2లో ముద్రించారు. ఈ అధ్యయనం కోసం మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్, వెల్‌కం అండ్ బ్రిటీష్ సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్ ఎన్డోక్రినాలజీ అండ్ డయాబెటిస్2 నిధులు సమకూర్చింది. ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహించిన డా. రాడ్‌మిషెల్ మాట్లాడుతూ.. గర్భం దాల్చిన తర్వాత పెయిన్ కిల్లర్స్ తీసుకునే విషయంలో మహిళలు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఒకవేళ తప్పనిసరైతే.. అతి తక్కువ డోసు మందులను, పరిమిత కాలం వాడాలన్న మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి అని చెబుతున్నారు.