సబ్ ఫీచర్

అబద్ధాలే ప్రచారాస్త్రాలుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశాన్ని అల్లకల్లోలం చేస్తూ, అబద్ధాలే ప్రచారాస్త్రంగా సాగుతున్న, పౌరసత్వ సవరణ చట్టంను గురించే ఈ వ్యాసం. చట్టంలో ఏముందో స్పష్టంగా తెలుసుకునేందుకు, చట్టంలో ఆంగ్లంలో ఏమి ఉందో కూడా తెలుసుకోక తప్పదుగదా!
దాని పేరు, ‘సిటిజన్‌షిప్ అమెండ్‌మెంటు యాక్ట్ 2019 యాక్ట్ 47 ఆఫ్ 2019’ అధికారికంగా ‘గెజిట్ ఆఫ్ ఇండియా’లో 12 డిసెంబరున ప్రచురితమైంది."Provided that any peron belonging to Hindu, Sikh, Buddhist, Jain, Parsi or Christian community from Afghanistan, Bangladesh or Pakistan, who entered into India on or before the 31st day of December 2014 and who has been exempted by the Central Government by or under clause(c) of subsection (2) of section 3 of the Passport (Entry into India) Act 1920 or from the application of the provisons of the Foreigners Act 1946 or any rule under or order made December, shall not be treated as illegal migrant for the purpose of this Act.

కాబట్టి హిందూ, సిక్కు, బుద్ధిస్టు, జైన్, పార్శీ, క్రిష్టియన్ మతస్థులెవరైనా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల నుంచి మన దేశంలోకి 31 డిసెంబరు 2014 లోపుగా ప్రవేశించినా- లేక మన కేంద్ర ప్రభుత్వం చేత - పాస్‌పోర్ట్(Entry into India Act 1920) ద్వారా లేక Foreigners Act 1946 లేక వాటి క్రింధ జారీచేయబడిన ఏవైనా నిబంధనలవలన మినహాయింపబడినా- వారిని చట్టవ్యతిరేకంగా వచ్చిన వారుగా (మైగ్రెంట్స్)గా చూడబడరు.
ఇదీ మన కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం! పౌరసత్వ సవరణ చట్టం... దానికి వ్యతిరేకంగానే, దేశంలో ఇంత హింసాకాండ సాగుతుంది!
2014లో మన దేశంలో- అంటే 6 సంవత్సరాల క్రితమే మన దేశంలో ప్రవేశించి, ఇక్కడే ఏదో విధంగా బ్రతుకీడుస్తున్న అమాయకులు, దౌర్భాగ్యులు సుమా!
వీరిలో ఎవ్వరూ ముస్లింలు లేరు, అంతా ఇతర మతస్థులే సుమా! వారి మీది జాలితో, వారిని బయటి దేశస్థులుగా పరిగణించవద్దు అని చట్టం చేయటం జరిగింది సుమా!
దానికే మన అతి ఉదార రాజకీయపక్షాలు, ఇంత రాద్ధాంతం చేస్తున్నాయి. ఇంత హింసాయుతంగా ప్రవర్తిస్తున్నాయి.
ఈ చట్టం ద్వారా, భారతీయ ముస్లింలకు జరిగిన అపకారం ఏమైనా ఉందా? ఏమీలేదు. వారనుభవిస్తున్న హక్కుల జోలికి ఎవ్వరూపోలా, ఆ సమాజంమీద ఎవ్వరూ చేయవేయలా?
మరేమిటీ ఆందోళనకు, ఈ దౌర్జన్యాలకూ కారణం?
ఇంకొక దుష్ప్రచారం... ఈ దేశాన్ని హిందూ దేశంగా మారుస్తున్నారని- దానికి ఆస్కారమే లేదని, ప్రశాంతంగా ఆలోచిస్తే, అర్ధమవుతుంది ఈ ప్రశ్న వచ్చింది కాబట్టి, దానిమీద సూటిగా నా అభిప్రాయాలను తెలియచేస్తున్నాను, పాఠకులు క్షమించవలె.
ప్రపంచంలో, ముస్లింకెన్ని దేశాలున్నాయి? అలాగే క్రైస్తవులకెన్ని దేశాలున్నాయి? హిందువులకెన్ని దేశాలున్నాయి?
హిందువులు ఈ దేశంలో అనాదిగా ఉన్న జాతి... ముస్లింలు, క్రైస్తవులు, ఆ మతాలు తరువాత పుట్టాయి. ఉదాహరణకు, నాలుగు వేదాలు ఈ దేశానివేకదా! అవి పుట్టిన నాటికి ఈ మతాలు లేవుకదా? మరి అంత పురాతన జాతికి, ప్రపంచంలోని ఇన్ని దేశాలలో, ఒక్క భారతదేశం వారిది అంటే, అది దౌర్జన్యమా? ద్రోహమా? అబద్ధమా? ఆలోచించండి.
ఇంకొకటి, ఈ హిందువులు ఈ దేశం మొత్తం ఏలినా, ఎప్పుడూ ఏ విదేశంమీదా దండెత్తలా, అక్కడ తమ సామ్రాజ్యం స్థాపించాలని కోరలా- అసలీదేశం దాటి బయట కాలుపెట్టలా. ఇవి చరిత్రక సత్యాలు కావా?
‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’, డిసెంబర్ 27వ నాటి పత్రికలో ఒక పెద్ద ఫొటోను ప్రచురించింది. ఏమిటది?
పాకిస్తానీ హిందూ స్ర్తిలు, న్యూఢిల్లీలోని మంజూకాతిలా ప్రాంతంలోని కాంపులో పనిచేయటం. వారంతా, పాకిస్తాన్‌లోని సింధు ప్రాంతంనుంచి, భారతదేశానికి 7,8 సంవత్సరాల క్రితం వచ్చినవారట! ఏమనాలి ఇలాంటి విషయాలను గురించి?
కాబట్టి ఒక్కటే మనవి... హిందువులందరూ, ముఖ్యంగా మతాచార్యులు ఈ విషయాలను గురించి ఆలోచించాలి. మనకు మార్గదర్శనం చేయాలి.
ఏమీలేని దానికే ఇంత దౌర్జన్యం, దుర్మార్గానికి పూనుకున్నవారి నేమనాలి? ఈ చట్టం ద్వారా, భారతీయ పౌరులైన ముస్లింలకేమయినా అపకారం జరిగిందా? లేనే లేదు సుమా!
చివరగా పాకిస్తాన్ ధోరణిలో ఈ వ్యాసం ముగిస్తున్నా.. ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపటంలో కూడా పాక్ తన వక్రబుద్ధిని చాటుకుంది.
క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి ఆసిఫ్‌గఫూర్ భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒరిస్సా లాంటి రాష్ట్రంలో హిందుత్వ పీడనకు గురవుతున్న క్రైస్తవులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని ట్వీట్ చేశాడు.
‘పాకిస్తాన్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఒడిస్సా లాంటి రాష్ట్రాల్లో హిందూత్వ పీడనను ఎదుర్కొంటున్న వారికి శుభాకాంక్షలు’ అని బుధవారం ట్వీట్ చేశారు.

- చాణక్య