సబ్ ఫీచర్

తరగని తాజాదనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టన్నులకొద్దీ టమాటాలు, క్వింటాళ్లకొద్దీ ఉల్లిగడ్డలను రోడ్డుమీద పారబోసే దృశ్యాలు నిత్యం ఎక్కడో ఓచోట కనిపిస్తూనే ఉంటాయి. అయితే రైతుకు ఇకముందు ఆ ఇబ్బంది ఉండదు. రేటు రాకపోయినా సరే పంట పారబోసుకునే దుస్థితి మాత్రం రాదు. బ్లాక్‌బాక్స్ అనే టెక్నాలజీ రైతుల పాలిట వరమే అని చెప్పాలి. ఎందుకంటే ఈ విధానంలో పంటను నిక్షేపంగా నిల్వ చేసుకోవచ్చు. నెలా రెణ్ణెల్లు కాదు ఏకంగా వెయ్యి రోజులు. అంటే రమారమి మూడేళ్లపాటు భద్రపరచుకోవచ్చు. ఆశ్చర్యంగా వుంది కదా! ఇదంతా బ్లాక్‌బాక్స్ టెక్నాలజీ మహిమ. వ్యవసాయ ఉత్పత్తులను వెయ్యి రోజుల వరకు తాజాగా ఉంచడమంటే మాటలు కాదు. ఎలాంటి ఆహార పదార్థమైనా సరే అస్సలు పాడవదు. కుళ్లిపోయే ఛాన్స్ ఉండదు. ఇంత ప్రత్యేకమైన పరిజ్ఞానాన్ని స్పెయిన్ శాస్తవ్రేత్తలు అభివృద్ధి చేశారు. ప్యాక్టరీ లేదా ప్లాంట్.. ఎక్కడైనా సరే ఈ టెక్నాలజీని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సాధారణంగా కోల్డ్ స్టోరేజీల్లో నైట్రోజన్ సాయంతో పదార్థాలను నిల్వ చేస్తుంటారు. బ్లాక్‌బాక్స్ పద్ధతిలో అలాంటిదేదీ ఉండదు. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉపయోగించరు. అందుకే ఇది ప్రత్యేమైన టెక్నాలజీ! ఈ విధానంలో నిల్వ ఉంచిన పదార్థాలు వెయ్యి రోజుల వరకు సహజత్వాన్ని కోల్పోవు. పోషక విలువలు చెక్కుచెదరవు. పండ్లు, కూరగాయలు, మాంసమే కాదు ఎలాంటి ఆహార పదార్థమైనా వెయ్యి రోజుల వరకు తాజాగా నవనవలాడుతుంటుంది. అమెరికాలో పేటెంట్ కలిగివున్న బ్లాక్‌బాక్స్ టెక్నాలజీని ప్రపంచమంతా వాడి చూసింది. ఇప్పుడిది మన దేశానికి కూడా వచ్చింది. విజ్తార్ అగ్రిటెక్ కంపెనీ ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంది. ఇందుకోసం స్పెయిన్‌కు చెందిన నైస్ ఫ్రూట్స్ కంపెనీతో టైఅప్ అయింది. భారత్‌లోని కోల్డ్‌స్టోరేజీ ప్లాంటకు ఈ సరికొత్త టెక్నాలజీ అనుసంధానం చేయబోతున్నారు. అందులో మొదటి రెండు యూనిట్లు మన హైదరాబాద్‌లో ఏర్పాటు కాబోతుండడం విశేషం! ఇండియాలో ఏర్పాటయ్యే బ్లాక్‌బాక్స్ కోల్డ్ స్టోరేజీలకు విజ్తార్ కంపెనీ టెక్నాలజీ అండ్ ఈక్విటీ భాగస్వామిగా ఉండబోతోంది. హిందూస్థాన్ ఎల్‌ఎన్‌జితో కలిసి హైదరాబాద్‌లో రెండు కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లు తెరవబోతున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో మామిడిపండ్ల నిల్వకోసం మరో రెండు ప్లాంట్లు పెట్టబోతున్నారు. బ్లాక్‌బాక్స్ టెక్నాలజీ ద్వారా రైతుల ఆదాయం నాలుగు రెట్లు పెరుగుతుందంటున్నారు విజ్తార్ అగ్రిటెక్ కంపెనీ ప్రతినిధి సాహిల్. ధరలు పడిపోగానే రైతులు పంటనంతా రోడ్లమీద పారబోసే సంఘటనలు ఇకముందు కనిపించవని ఆయన నమ్మకంగా చెప్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులను రెండున్నరేళ్లపాటు నిక్షేపంగా భద్రపరచుకోవచ్చునని తెలిపారు. మంచి రేటు వచ్చినపుడు కోల్డ్ స్టోరేజీ నుంచి తీసి పంట అమ్ముకోవచ్చని వివరించారు. ఒకవేళ రేటు రాకపోతే తామే విదేశాలకు ఎగుమతి కూడా చేసి పెడతామని తెలిపారు. దీనివల్ల అటు రైతులకు లాభం చేకూరుతుంది, ఇటు దేశానికి విదేశీ మారక ద్రవ్యం సమకూరుతుందని సాహిల్ అభిప్రాయపడ్డారు. ముందుగా రోజుకు 30 టన్నుల నిల్వ సామర్థ్యం గల ప్లాంట్లను ఏర్పాటుచేసి క్రమంగా వెయ్యి టన్నులకు పెంచాలని విజ్తార్ కంపెనీ భావిస్తోంది. బ్లాక్‌బాక్స్ స్టోరేజీ ప్లాంట్ల రాక కోసం రైతులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.