సబ్ ఫీచర్

స్వర్గద్వార ఏకాదశి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవతలకు ధనుర్మాసం బ్రాహ్మీ ముహూర్త కాలం. మహా విష్ణువు ఆషాఢం మొదలుకుని, కార్తీకం వరకు నిద్రించి, సూర్యడు ధనుర్రాశిలో ప్రవేశించాక, విష్ణు సంబంధ శ్లోకాలచే మేల్కొలిపి అరుణోదయంలో ఉష:కాల షోడశోపచార పూజలు చేసి, పులగం - పొంగలి - శర్కర నివేదించాలి. నిర్ణయ సింధు కారుని ప్రకారం ఉదయానికి పూర్వం నాలుగు ఘడియలు, ఘడియ అనగా ఇరువై నాలుగు నిమిషాలు - గంటన్నరపై ఆరు నిమిషాలకు పూర్వము అరుణోదయం అగును. ధనుర్మాసము సౌరమానం ప్రామాణికానుసారం కాగా, శుక్ల ఏకాదశి చాంద్రమానమైన తిథి. ప్రతి మాసమునందలి ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. గృహస్తులకు, బ్రహ్మచారులకు, నిత్యాగ్ని హోత్రులకు నైమిత్తిక కర్మగా ఉపవాసాద్యాచరణము విధించబడినది. ఇట్టి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన దివసము కావునే ఏకాదశి హరి వాసరముగా కొనియాడబడుచున్నది. అందు సౌరమానము నందలి ప్రశస్తమైన ధనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి (మార్గశీర్షము లేక పుష్య మాసం) వైకుంఠ ఏకాదశిగా పిలువ బడుచున్నది. సూర్య చంద్రులు నేత్రములుగా కలిగిన వైకుంఠ వాసునికి సౌర, చాంద్రమానాలలో ప్రశస్తమైన ధనుర్మా శుక్ల పక్ష ఏకాదశి అత్యంత ప్రీతికరమైనది. ‘‘్ధనూరాశి స్తితే సూర్యే శుక్ల ఏకాదశి తిథౌ; త్రింషత్ కోటి సురై: సాకం బ్రహ్మ వైకుంఠ మాగత: పాలస్త్యేనని పీడితా: సురగణా: వైకుంఠలోకం యయు:; ద్వారే తత్ర విషాదభావ మనసా సూకె్తైర్ హరిం తుష్టువు: శుక్లై: శ్రీ:హరి వాసరే ప్రభాత సమయే భానౌ ధను: సంస్థితే, తేభ్యోదాత్ సుఖ దర్శనం కరుణయా నారాయణో మాధవ:’’ రావణుని బాధలను తాళలేని దేవతలు బ్రహ్మను ఆశ్రయింపగా...ఆదేవుడు ధనుర్మాస శుక్ల ఏకాదశి దినమున దేవతలందరితో వైకుంఠమునుచేరి, హరి వాసరమునందు దేవతలు విషాద భావ మనస్కులై శ్రీహరిని వేదోక్తంగా స్తుతించగా, వారికి శ్రీహరి సుఖ దర్శనమును కలుగజేసెనని వివరించబడినది. శ్రీప్రశ్న సంహిత (ఐదవ అధ్యాయము) నందు గల ఐతిహ్యము ననుసరించి మధు కైటభులను భగవానుడు సంహరించినపుడు వారు దివ్యరూపధారులై దివ్య జ్ఞానము పొందగా, బ్రహ్మాదులెవరైనను నీలోకము వంటి మందిరమును నిర్మించి, ఏకాదశి దినోత్సవమును గావించి, నిన్ను నమస్కరించి ఉత్తర ద్వార మార్గమున సమీపింతురో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగునట్లు దీనిని మోక్షోత్సవ దినముగా వరమిచ్చినట్లు తెలియుచున్నది. ముక్కోటి దేవతల బాధలను నివారించినందున ‘ముక్కోటి ఏకాదశి’గాను, వైకుంఠ దర్శనము కలిగించునది కనుక ‘వైకుంఠ ఏకాదశి’గాను, భగవద్దర్శనము చేయు పవిత్ర దినమైనందున ‘్భగవదవలోక దివసము’గ కొనియాడ బడుచున్నది. ధనుర్మాస ఏకాదశి కొన్నిసార్లు మార్గశిర మాసమందు, మరికొన్ని మారులు పుష్యమాసమందు రావడం చేత రెండు మాసాల శుక్ల ఏకాదశులు ప్రశస్తములైనవే. మార్గశిరమాస ఏకాదశిని మోక్షైకాదశి అని, పుష్యమాస ఏకాదశిని పుత్రదైకాదశి, రైవత మన్వాది దినమని పిలుస్తారు. శుక్ల ఏకాదశి నాడు సూర్యుని నుండి వెలువడిన పదకొండవకళ చంద్రుని చేరుతుండగా, బహుళ ఏకాదశి నాడు చంద్రుని నుండి పదకొండల కళ సూర్య మండలాన్ని చేరుతుంది. కృతయుగంలో చంద్రవతీ నగరాన్ని ఏలిన మురుడనే రాక్షసుడిని, విష్ణు దేహంనుండి ఉత్పన్నమైన స్ర్తిమూర్తియే ఏకాదశి కనుక ఏకాదశికి అధిదేవతయైన ఏకాదశీదేవి మహా విష్ణు అంశయే. సూర్యుడు ధనురాశిపై నుండగా వచ్చిన తొలి ఏకాదశి (వైకుంఠ) పుణ్యదినాన తన దివ్యమంగళ రూపంతోవైకుంఠ ద్వారంవద్ద దేవతలకు శ్రీమహావిష్ణువు దివ్యదర్శనం గావించిన సందర్భంగా, కోటి తేజోమూర్తిని దర్శించిన బ్రహ్మాదిదేవతలు, సనకసనందాది మునులు, ‘పశ్యన్ నిముష మాత్రేన కోటి యజ్ఞంఫలం లభేత్’ అని వచించినట్లు బ్రహాండ పురాణంలో వర్ణించబడింది. ఈపవిత్రదినాన ఆలయాలలో ఉత్తర ద్వారంవద్ద సూర్యోదయానికి పూర్వమే స్వామి దర్శనం చేసుకోవడం సత్సాంప్రదాయం.

-సంగనభట్ల రామకిష్టయ్య