క్రైమ్/లీగల్
దంపతుల ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 16 October 2018
చెన్నై: రెండున్నరేళ్ల కుమార్తెను బ్లేడుతో కోసి హత్యచేసి తాము ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న దంపతుల ఉదంతం ఇది. ఈ ఘటన తమిళనాడులోని కడలూర్ జిల్లా దిట్టకుడి సమీపంలో జరిగింది. ఇడైసెరువాయ్ కాలనీకి చెందిన మరుదముత్తు(30) ఉషా దంపతులు గుజరాత్లో ఉద్యోగం చేస్తున్నారు. వీరు తమ స్వగ్రామానికి వచ్చారు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం ఎంత సేపటికీ తలుపులు తెరవకపోవటంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి చూడగా మరుదముత్తు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. కుమార్తె, భార్య అచేతనంగా పడి ఉన్నారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి మృతదేహాలను పోస్టుమార్టమ్కు తరలించారు.