రాష్ట్రీయం

కార్పొరేటర్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేయర్ దంపతుల హత్యకేసులో మలుపు
చిత్తూరు, డిసెంబర్ 17: చిత్తూరు నగరం 38వ డివిజన్ మున్సిపల్ కార్పొరేటర్ పులిచెర్ల శివప్రసాద్‌రెడ్డి (40) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు నగర మేయర్ దంపతుల హత్య కేసు విషయమై చిత్తూరు తాలుకా చంద్రశేఖర్, ఎస్సై మురళి పోలీసు సిబ్బందితో కలసి బుధవారం సాయంత్రం శివప్రసాద్‌రెడ్డి ఇంటిలో సోదా చేయడంతో పాటు ఆయనను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేసిన విషయం పాఠకులకు విదితమే. ఈ క్రమంలో పోలీసుల వైఖరికి మనస్థాపానికి గురై శివప్రసాద్‌రెడ్డి గురువారం ఉదయం మిట్టూరులోని తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం సాయంత్రం పోలీసుల విచారణను జీర్ణించుకోలేని శివప్రసాద్‌రెడ్డి రాత్రంతా నిద్రపోకుండా బాధతో గడిపినట్లు ఆయన తల్లి మాజీ కౌన్సిలర్ కౌసల్య తెలిపారు. శివప్రసాద్‌రెడ్డి రాసి తన జేబులో ఉంచుకొన్న రెండు పేజీల లేఖను సిఐ స్వాధీనం చేసుకున్నారు. మేయర్ దంపతుల హత్యలను సాకుగా చూపి తనను పోలీసులు వేధింపులకు గురి చేసారని, వాటిని భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు శివప్రసాద్‌రెడ్డి స్వయంగా రాసి ఉంచుకున్న రెండు పేజీల లేఖలో పేర్కొన్నాడు.