స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-169

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్య, కౌమార, వన, వృద్ధాప్యాల నన్ను క్రమ్ముకొంటాయి. దయతో నా ప్రార్థన విను. ‘సఖే సఖాయ మజరో జరిమ్ణే’ ‘‘ఓ మిత్రుడా! నన్ను వృద్ధాప్య దశనుండి రక్షించు. అయితే ఈ కోరిక దురాశతో కోరినదికాదు. నా శరీరం వృద్ధాప్య దశను తప్పక పొందేదది నాకు బాగా తెలుసు. కాని నేను కోరేది బాల్యంలోనో వనంలోనో ఆ వృద్ధాప్యదశ నా శరీరాన్ని ఆవహించ కూడదన్నదే నా ప్రార్థన. ఓ విత్రుడా! ఈ నా మరొక ప్రార్థన విను. నీవు మరణ రహితుడవు. శాశ్వతుడవు. అమృత స్వరూపుడవు. మృత్యువు నీ దరికి వచ్చేందుకు కూడ భీతి చెందుతుంది. కాని మమ్ములను మరణమే సహజ ధర్మంకలవారిగా పుట్టించావు. కాని మమ్ము పసిరికాయలా, కుళ్లిన పండులు మృత్యువనే చెత్తబుట్టలో పడవేయకు. ‘మర్త్యాన్ అమర్త్యస్త్వం నః’ ‘‘మృత్యువునుండి అమర్త్యుడవైన నీవే ముమ్మ రక్షించు’’ మిత్రుడవైన ఓ దేవా! నా రుూ కోరికలను వమ్ము(వ్యర్థము) చేయవు గదా!
***
155. మరణానికి ముందే
దైవాన్ని ఆశ్రయించు
ఆ వో రాజానమధ్వరస్య రుద్రం హోతా రం సత్యయజం రోదస్యోః
అగ్నిం పురా తనయిత్నోరచిత్తాద్ధిరూపమవసే కృణుధ్వమ్‌॥ ఋ.4-3-1.
భావం:- మృత్యువుచే కబళింపబడి మరణించక ముందే యజ్ఞ నిర్వాహకుడగు హోత, ఊర్ధ్వ, అధోలోకాలు రెండింటిని సంయోజన చేసే యాజ్ఞికుడు మరియు భయంకరుడగు రుద్రుడే అయినా బంగారు కాంతులీను హిరణ్మయ రూపుడగు భగవానుని ఆశ్రయించి రక్షణ పొందు.
వివరణ:- భగవంతుని సృష్టియే ఒక యజ్ఞం. అదే అధ్వరం. అధ్వ= మార్గాన్ని ‘ర’=చూపేది. జీవుడికి ఉన్నతమైన మార్గాన్ని ఈ లోకంలోనే చూపుతుంది కాబట్టి అది అధ్వరమని సార్థక నామధేయాత్మకమైంది. సృష్టిరూపమైన యజ్ఞానికి పురోహితుడు విధాత -బ్రహ్మ. కాబట్టి ఈ యజ్ఞంలో లేదా అధ్వరంలో హింసకు తావే లేదు. ఓ మానవుడా! ఇట్టి అధ్వరంలో హింసా రహితుడవై పాల్గొను. అహింస సత్యానికి మరో రూపం. భగవంతుడు అధ్వర రూపమైన ఈ సృష్టికి చెందిన సర్వవ్యవస్థలను సర్వశ్రేష్ఠమైన ‘సత్య’్ధర్మమనే పునాది మీదనే సృష్టించాడు. అథర్వణ వేదంలో స్వయంగా భగవంతుడే-
సత్యం బృహదృతముగ్రం దీక్షా తపో బ్రహ్మ యజ్ఞ?
పృథివీం ధారయంతి॥ అథ.వే.12-1-1.
‘‘మహత్తమ సత్యం, మహోగ్ర ఋతం, దీక్ష, తపస్సు(జ్ఞానం) యజ్ఞం ఇవన్నీ భూమిని వహిస్తున్నాయి’’అని ఉద్ఘాటించాడు. ఆ కారణంగా ఆ దైవమే ‘సత్యయజం రోదస్యోః’ ఊర్ధ్వ-అధోరూపమైన రెండు లోకాలలో సత్యమైన యాజ్ఞికుడు. సృష్టి సమస్త వ్యవస్థలను సువ్యవస్థితం చేసేవాడు కూడ ఆ దైవమే. ఆ దైవ నిర్మితమైన వ్యవస్థల కారణంగానే పాపులకు కష్టాలు కలుగుతాయి. దానివలన వారు రోధిస్తారు. ఎందుకంటె దృశ్యమానమైన సృష్టి మరియు యజ్ఞకర్త బ్రహ్మచారికి రుద్రుడుగా కనబడుతాడు. వాస్తవానికి ఆ దైవం భయంకరమైన రుద్రుడు కాడు. ‘హిరణ్మయ రూపమ్’బంగారు శరీరచ్ఛాయతో ప్రకాశించే సుందరాకారుడు. అట్టివాడు పాపులకు ‘రుద్రుడు’గా ఎందుకు కన్పడుతున్నాడు? అంటే వారు తమ పాపకర్మలచేత దైవానికి దూరంగా జరిగిపోయినవారు కాబట్టి. కాని సత్కర్మాచరణతో దగ్గరైన పుణ్యాత్ముల కా రుద్రుడు రుద్రుడు కాడు. హిరణ్మయ రూపుడే. అందుచేత పాపాచరణమే మృత్యువు. అది తలమీద తాండవిస్తూ ఉన్నదన్న జాగరూకత కలవాడు అమృతుడవుతున్నాడు. ‘మహద్భయం వజ్రముద్యతం య ఏతద్విదురమృతాస్తే భవంతి’ ‘‘అని ఉపనిషత్తు వచిస్తూంది. అందుచేత ఓ మానవుడా! ఆ మృత్యు వజ్రదండం తలమీద పడకముందే హిరణ్యరూపుడైన భగవంతుని ఆశ్రయించి రక్షకునిగా పొందు. ‘అగ్నిం పురా... కృణుధ్వమ్’అని ఉపదేశిస్తూందీ మంత్రం. అలా పొందిన వానిని మృత్యువేమి చేయగలదు? కాబట్టి పాపమృత్యువు కబళింపకముందే భగవదాశ్రమాన్ని పొందాలని ‘ఇహ చేదవేదీదథసత్యమస్తి’ (కేనోపనిషత్తు.2-5) ‘ఈ జన్మలోనే తెలిసికొంటే చాల ఉత్తమ’’మని కేనోపనిషత్తు హితోపదేశం చేస్తూంది. మరి ఎవ్వరూ దీనిని పెడచెవిని పెట్టరుగదా!
**
156. మనమేమి పాపం చేసామో ఎవరికి తెలుసు?
కిం స్విన్నో రాజా జగృహే కదస్యా- తి వ్రతం చక్రూమా కో వి వేద:
మిత్రచ్చిద్ధి ష్మా జుహురాణో దేవాన్ శ్లోకో న యాతామపి వాజో అస్తి॥ ఋ.10.12.5.
భావం:- రాజరాజేశ్వరుడయిన భగవానుడు మావి అయిన వానిని వేటిని తీసుకొన్నాడు?
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు