స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-170

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
మేమూ దేవాధిదేవుని ఆజ్ఞలను, నియమాలను ఏ విధంగా అతిక్రమించాం? లోకంలో ఈ విషయాన్ని ఎవడు పూర్తిగ తెలుసుకొంటున్నాడో వాడు సహజ మిత్రులైన దేవతలపైన కూడ కోపంతో ఉండడు. పాపఫలమైన దుఃఖంచేత భయకంపితులు కాక ధర్మాచరణ చేసే వారికి అన్నం, బలం, జ్ఞానం సమస్తమూ సిద్ధిస్తాయి.
వివరణ:- సైనికులు తమ చేతిలో ఆయుధాలతో ప్రజలను చంపుతూ ఉంటే ధార్మికుడైన రాజు లేదా రాజ్యవ్యవస్థ చూస్తూ ఊరుకోదు. సైనికుల నుండి ఆయుధాలను వెంటనే స్వాధీనపరచుకొంటుంది. అంతేకాదు వారికి తగిన దండన కూడ విధిస్తుంది. అదే విధంగా మానవులు తమవద్దనున్న మారణాయుధాలతో తోటి మానవులకు ఉపకారానికి బదులుగా అపకారాన్ని చేస్తూ ఉంటే మరియు హద్దులు మీరి ప్రవర్తిస్తూ ఉంటే ధర్మాధీశుడైన భగవంతుడు వారి నుండి ఆ మారణాయుధాలను ఉపసంహరించి ఎన్నడూ పాపాచరణకు అవకాశమే లేని జీవులుగా వారిని పుట్టిస్తాడు. లోకంలో ఎక్కడైనా అల్పజ్ఞుడైన ప్రభువు దండనీతిలో స్ఖాలిత్యముండవచ్చునేమో గాని సర్వజ్ఞుడైన పరమాత్ముని దండనీతి వ్యవస్థలో అట్టి స్ఖాలిత్యమే ఉండదు. తనవద్దనున్న ఎటువంటి సాధన సంపత్తినైనా దైవముపసంహరిస్తే వివేకవంతుడయిన వ్యక్తి విచారించక ‘కిం స్విన్నో రాజా జగృహే’ ‘రాజరాజేశ్వరుడు మావద్దనుండి వేనిని లాగుకొన్నాడు?’’అని సమాధానపడతాడు. అంతేకాదు ‘కదస్యాతి వ్రతం చకృమా కో వివేద’ దైవాజ్ఞలను మే మేవిధంగా ఉల్లంఘించామో మాలో ఎవరికి మాత్రం తెలుసు?’’అని పశ్చాత్తాప్తుడవుతాడు.
లోకంలో పాపులు పాపకార్యాలను చేస్తారు. కాని తాము పాపాలు చేసిన విషయానే్న మరచిపోతారు. కాలక్రమంలో ఆ పాపకార్య ఫలాలు సంప్రాప్తం కాగానే గాభరాపడి చివరకు దైవదూషణకు పాల్పడతారు. కాని బుద్ధిమంతులు దుఃఖం పాపకర్మ ఫలమేనని గ్రహించుకొంటాడు.
పాపమే చేయకుంటె దుఃఖ మెక్కడినుండి ప్రాప్తిస్తుంది. ఈ సత్యాన్ని తెలిసికొన్న బుద్ధిమంతులు దైవదూషణ చేయక ‘కదస్యాతి వ్రతం చకృమా కో వి వేద’ ‘‘దైవ శాసనాలను మేము ఎనె్నన్నివిధాలుగా అతిక్రమించామో!’’అని ఆత్మవిమర్శ చేసికొని పాప ఫలాలననుభవిస్తూ ధర్మమార్గాన్ని వీడక ధర్మాచరణ ఎడల దృఢ వ్రతులవుతారు.
ఈ విధంగా ‘శ్లోకో న యాతామపి వాజో అస్తి’ ‘‘స్థిరచిత్తంతో పాప ఫలమైన దుఃఖం చేత విచలితులుకాక ధర్మాచరణ చేసే వారికి కీర్తి, ఆహార సమృద్ధి, బలం, ఐశ్వర్యం తప్పక సిద్ధిస్తాయి.’’
ఈ వేదమంత్రోపదేశాన్ని చిత్తశుద్ధితో గ్రహించి దుఃఖాన్ని తమ పాపకర్మల ప్రతిఫలంగా భావించి దైవనిందకు పాల్పడక సంతోషంగా అనుభవిస్తూ ధర్మాచరణకు దృఢ నిశ్చయంతో పూనుకొన్నవానికి సమస్యైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాకాక దుఃఖం చేత విచలితులై దైవనిందకు పూనుకొన్నవారికి ఈ లోకంలో దుష్కీర్తితోబాటు సుఖీజీవనం కూడ లభ్యంకాదు.
**
జీవన రాత్రిలో నిన్ను పొందినవాడు అదృష్టవంతుడు
ఆరే అస్మదమతిమారే అంహ ఆరే విశ్వాం దుర్మతిం యన్నిపాసి
దోషా శివః సహసః సూనో అగ్నే యం దేవ ఆ చిత్సచసే స్వస్తి॥
ఋ.4-11-6.
భావం:- ఓ అగ్నీ! ఎప్పుడు నీవు జీవులను రక్షిస్తావో అప్పుడే నీవు వారి అజ్ఞానాన్ని - కర్మశూన్యతను- నాస్తికత్వాన్ని దూరంచేస్తావు. పాపాలను హరిస్తావు.
మనసులోని దురాలోచనలను పూర్తిగా నిర్మూలిస్తావు. బలవంతులను కూడ అణచివేయగల ఓ అగ్నీ! దివ్యమైన రాత్రియందు వచ్చి ఆనందకరంగా దర్శనమిచ్చే శివ భగవానుడవు కూడ నీవే.
వివరణ:- మానవుడు భయంకర పాపప్రవాహంలో కొట్టుకుపోయేటప్పుడు లోకంలో నిలువనీడ కొంచెం కూడ ఉండదు. ఆత్మకు తన తప్పిదంవలన ఇంద్రియాలు శత్రువులై వశంకాక స్వేచ్ఛగా సంచరింపసాగితే విధిలేక వానికి ఆత్మ వివశమై వశపడితే దానికి పాపమనే సూది గ్రుచ్చుకొన్నట్టే. ఈ విషయాన్ని వివరిస్తూ శుక్లయజుర్వేదమీ విధంగా వర్ణించింది.
అసుర్యా నామ తే లోకా అంధేన తమసావృతాః
తాన్ స్తే ప్రేత్యాపి గచ్ఛంతి యే కే చాత్మహనో జనాః యజు.40-3॥
భావం:- ‘‘తమ ఆత్మలను స్వయంగా నాశనం చేసుకొనేవారు మరణించిన పిమ్మట ఘోరాంధకారంతో ఆవరించబడిన లోకాలలో (కేవలం దుష్కర్మ ఫలాలను అనుభవించే జన్మలలో) పడిపోతారు.’’అంటే ఆ జన్మలో వారు ఎన్నడూ వెలుగులను అనగా సుఖాలను చూడనే చూడలేరు.
ఇంకావుంది...