స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-173

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు రాజ్యాల మధ్య వైర భావాలు పొడసూపితే అవి ఒకదానినొకటి దురాక్రమణ చేసేందుకు తీవ్ర ప్రయత్నంచేస్తాయి. ఆ సమయంలో ఆ దేశంలోని ఉత్సాహవంతులైన వీరులు- పౌరులు తమ దేశాధిపతి, సేనాధిపతి లేదా నాయకునితో ఎలా ప్రసంగిస్తారో దానిని ఈ మంత్రం వివరిస్తూంది.
‘‘శత్రువులు మా నెత్తిమీదకు వచ్చిపడ్డారు. వారు మమ్ములను తమకు దాసులుగా చేసుకొనేందుకు ఎత్తులు వేస్తున్నారు. మీ నేతృత్వంలో మేము వారి ఎత్తులను-ప్రయత్నాలను వమ్ముచేస్తాం. శతృవులు మమ్ములను యుద్ధానికి కవ్విస్తున్నారు.
వారు తమ సైనిక బలం పైన- బాహుబలంపైన చాలా దృఢ విశ్వాసంతో ఉన్నారు. వారిని మేము పరాజితులను చేయగలమన్న పూర్తివిశ్వాసం మాకుంది. మీరు మాకు నాయకత్వం వహించండి. సైన్యాన్ని యుద్ధంలో విజయపథంగా నడిపించడమొక కళ. వివిధ మనస్తత్వాలు గల అనేకుల్ని స్వదేశంకోసం ప్రాణాలర్పించే తెగువగలవారిగా శత్రువులపైకి నడిపించడం మాటలేమీకాదు. దీనికి బుద్ధిచాతుర్యం, దూరదృష్టి మొదలైన గుణాలెంతో ముఖ్యం.
ఇలా ప్రసంగించినవారు సహితం బలహీన క్షణాలలో తమ శక్తియుక్తులను మరచి మరల భీరువులై దైవాన్ని ఎలా ప్రార్థిస్తారో క్రింది మంత్రం ఇలా వివరిస్తూంది.
వి న ఇంద్ర మృధో జహి నీచా యచ్ఛపృతన్యతః
అధమం గమయా తమో యో అస్మాన్ అభిదాసతి॥ అథ.1-21-2.
భావం:- ఓ ఇంద్రా! నీవు హంతకులను వధించు. కలహప్రియులై మాతో యుద్ధం చేసేవారిని క్రియాహీనులుగా చేయి. మమ్ము ఓడించి దాసులుగా చేసుకోదలచిన- వారిని ఘోరాంధకారంలోనికి త్రోసివేయి.
కాబట్టి అలసత్వమూ, అజాగ్రత్త పరాజయానికి ప్రథమ సోపానాలు. నీవు విజయాన్ని కోరుకొంటే ‘స త్వం నో వర్ధప్రయసా శచీవసో’ ‘‘అభివృద్ధియే ధనంగాగలవాడా!
నీవు మమ్ము ధర్మపురుషార్థంతో ముందుకు నడిపించు’’అని నాయకుణ్ణి అర్థించాలి. ఎవరికి కూడ దుడుకుతనంతో ప్రవర్తిస్తే విజయం లభించదు. క్షణికమైన ముఖప్రీతి మాటలకు పొంగిపోయి తమ భుజబల దర్పంతో శత్రువులమీద విరుచుకొని పడితే విజయం మాత్రం వరించదు. అట్టి దుడుకు చేష్ట చివరకు నిరాశనే కలిగిస్తుంది.
ఆ దశలో మనిషి బుద్ధి స్థిరంగా ఉండదు. నీతి శాస్తజ్ఞ్రులు చెప్పిన ‘బుద్ధి ర్యస్య బలం తస్య నిర్బుద్ధేస్తు కుతోబలమ్’ బుద్ధిగల వాడిదే బలం. బుద్ధిహీనుడికి బలమెక్కడుంటుంది? అన్న వచనానుసారం మనిషికి నిజమైన బలం బుద్ధియే. కాబట్టి సేనా నాయకుడు బుద్ధిమంతుడై యుండాలి.
అందుకే మంత్రంలో సేనానాయకుణ్ణి ‘శచీవసు’=బుద్ధియే ధనంగా గలవాడని పేర్కొంది. అట్టి వానికి హితం ఆయన అనుచరులలో కూడ ఇమిడి ఉంటుంది. అందుకే వేదం ‘్ధయ జిన్వ వసువిదః’ ‘‘విజయ ధనాన్ని చేకూర్చే బుద్ధిని ఉత్తేజపరచుము’’అని మంత్రంలో ప్రతిపాదించింది. కాబట్టి నాయకుడు బుద్ధిమంతుడు, బుద్ధిమంతులైన అనుయాయులు, దేశంలోని పౌరజనం కూడ బుద్ధిమంతులు అయితేనే ఆ దేశానికి ఎటువైపు నుండియు భయం సంభవించదు.
ఓ అగ్నీ! నీవు సక్రమ మార్గంలో
ధనప్రదానం చేస్తావు
నూ నో అగ్నే- వృకేభిః స్వస్తి వేషి రాయః పథిభిః పర్ష్యంహః
తా సూరిభ్యో గృణతే రాసి సుమ్నం మదేమ శతహిమాః సువీరాః॥
ఋ.6-4-8॥
భావం:- ఓ అగ్నీ! నిష్కపటమైన మార్గంలో సుఖదాయకమైన ధనాన్ని మాకు నిస్సందేహంగా ప్రదానంచేస్తున్నావు. దానివలన మా దుర్గతుల నుండి మమ్ము సరిదిద్ది కాపాడుతున్నావు. నిన్ను ప్రార్థన చేసినవానికి ఉత్తమ విద్వాంసులనుండి ధనాన్ని దానినుండి సుఖాన్ని అనుగ్రహిస్తున్నావు. ఉత్తమ వీరులమైన మేము వందల యేండ్లు ఆనందంగా ఉంటాం.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు