స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-175

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశుజాతికి భిన్నంగా తనకు మరియు తమ జాతి అభ్యున్నతికై ఎప్పుడూ విచారణచేస్తూ ఆ ప్రయత్నాలలో నిమగ్నమై యుంటారు. కేవలం ప్రస్తుత జన్మలోనే కాదు భవిష్యజ్జన్మలలో కూడ సుఖజీవనంకోసం ప్రయత్నాలను ఈ జన్మలోనే చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు పుత్ర, మిత్ర, కళత్రాదులు, బంధువులు, ఐశ్వర్యం, ధనధాన్యాలు, గృహావాసాలు ఇలాంటి వెనె్నన్నో మానవ జీవితానికి సుఖకారకాలే అయినా మానవుడు వీనినన్నింటినీ పొంది కూడ సుఖ సంతోషాలను పొందడం లేదు. పొందినా తాననుకొన్నంత సుఖసంతోషాలను పొందలేకపోవడం కూడ ఉంది. ఆ కారణంగా వ్యాకులచిత్తుడై ఏదో ఒక వాస్తవిక సుఖముందని తలంచి దానికోసం తహతహలాడుతూ అనే్వషిస్తూ ఉన్నాడు. ఆ అనే్వషణలో విచార తత్పరుడికి ‘వి యస్తస్తంభ రోదసీ చిదుర్వీ ప్ర నాకమృష్వం నునుదే బృహంతమ్’ (ఋ.7-86-1) ‘విశాలమైన ఈ ద్యావాపృథువులను స్తంభంవలె ఆధారం చేసికొన్నవానికి ఆ మహాసుఖాన్ని అవే కల్పిస్తాయి’అన్న సంగతి బోధపడుతుందని ఋగ్వేదం స్పష్టంచేసింది.ద్యానాపృథువులే ఆ సుఖాన్ని కల్పిస్తాయంటే ఆ రెండింటిమధ్య జీవించే కాలంలోనే అనగా వర్తమాన జన్మలోనే ఆ సుఖం ప్రాప్తమవుతుందని భావం.
ఈ చర్చనుబట్టి మనిషిలో ఉండే ప్రత్యేకమైన జ్ఞానమే అనే్వషించేవానికి సుఖకారణమవుతుంది. కాబట్టి సుఖాభిలాషి అట్టి జ్ఞానార్జనకొఱకు ‘ఇహ త్వా భూర్యా చరేదుప త్మన్’ ‘ఈ జన్మలోనే మానవుడు సర్వాత్మనా ఓ దేవా! నినే్న ఆరాధించాలి’అని వేదం పేర్కొంటూంది. ఈ ఆరాధన రేపటికి వాయిదావేసేదికాదు. ఏమో!! రేపటికి వాయిదావేస్తే ఈలోగా మృత్యువే రావచ్చునేమో. జీవిత పర్యంతమూ భగవదారాధనకే ప్రాముఖ్యమీయాలి.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు