స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-176

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
‘కార్యం వా సాధయేయం శరీరం నా పాతయేయమ్’ ‘కార్యాన్నైనా సాధిస్తాను మరణించైనా మరణిస్తాను’ అన్న పెద్దల వచనాల్ని ఈ విషయంలో పాటించాలి. చావోబ్రతుకో మనిషియే నిర్ణయించుకోవాలి. అందుచేత ‘దోషావస్త ర్దీదివాంసమను ద్యూన్’ రాత్రింబవళ్లు ప్రకాశమానుడైన ఆ దైవానికి సేవచేసుకోవాలి అని వేదం నిర్దేశిస్తూంది. ఒక దినంచేసి పది దినాలు ఆరాధన మానివేయడం కూడా ఉత్తమం కాదు.
శరీర పోషణకు ప్రతిదినమూ నియమిత సమయాలలో ఆహారాన్ని భుజించి ఎలా సుఖంగా ఉంటున్నామో అదే రీతిగా ఆత్మను పరిపుష్టం చేసికొనేందుకు నియమానుసారం భగవదారాధన ఈ జన్మలోనే చేసుకోవాలి. అదే ఉత్తమ మానవుని జీవన విధానం.
**
డబ్బు ఎక్కువుంటే దానం చేయి- తక్కువుంటే తృప్తి పడు.
ఉత్తిష్ఠతావ పశ్చతేంద్రస్య భాగమృత్వియమ్‌
యది శ్రాతం జుహోతన యద్యశ్రాతం మమత్తన॥ ఋ.7-72-1.
భావం:- ఓ జనులారా! మీరందరు మేల్కొనండి. సంపదకు చెందిన వ్యవస్థీకృత విభాగాన్ని లోతుగా పరిశీలించండి. ఒకవేళ మీ సంపద సంపూర్ణమైయుంటే భగవదర్పణం చేయండి. అంటే భగవంతుడు మానవ హృదయాలలో ఉంటాడు కాబట్టి సంపదను మానవ సమాజపరం చేయండి. ఒకవేళ మీ సంపద అసంపూర్ణమైయుంటే ఉన్నదానితో సంతృప్తిగా ఉండండి.
వివరణ:- మానవ సమాజం గురించి వేదం చెప్పిన సూత్రాలు చాలా ఉదాత్తమైనవి. మానవ సమాజం ధన-్ధన్యాలతో మహదైశ్వర్యంతో తులతూగుతూ ఉండాలని వేదం ఆక్షాంక్షించింది. ఆకాంక్షను సాధించేందుకు ‘ఉత్తిష్ఠ’‘లెమ్ము’ అని వేదం ప్రబోధించింది. మానవ సమాజాభివృద్ధికి చేసే కృషిలో కేవలమొక వ్యక్తి ప్రయత్నంగాగాక సమష్టిగా ప్రయత్నం జరగాలని వేదం సమష్టి ప్రయత్నానికి ప్రాధాన్యమిస్తూ ప్రబోధించింది.
సమాజంలో కొందరు అధికులు మరికొందరు అధములుగా ఉంటే ఆ సమాజం అంగవైకల్యంగల మనిషి వంటిదే అవుతుంది. అందుకే వేదం ఉత్తిష్ఠత ‘‘మీరందరు లేవండి’’అని జాగృతపరచింది. జాగృతులై ఏమిచేయాలి? ‘ఆవపశ్యతేంద్రస్య భాగముత్వియమ్’ ఐశ్వర్య సాధక వ్యవస్థలోగల విభాగాన్ని లోతుగా పరిశీలించు’మని వేదం హెచ్చరించింది. ఈ హెచ్చరికనే కఠోపనిషత్తు (1-3-14) ‘ఉత్తిష్ఠత. జాగృత. ప్రాష్యవరాన్ని బోధత’ ‘లే. మేలుకో, శ్రేష్ఠమైన ద్రవ్యాలనుపొంది చైతన్యవంతుడవు కమ్ము’’అని యథాతథంగా పునరుద్ఘాటించింది.
పరిశీలిస్తే వేదోపనిషత్తులు చెప్పిన ఆ రెండు వాక్యాలు ఒకదానికొకటి సమానార్థకాలే. ‘అవపశ్యత’అని వేదం చెప్పినా ‘వరాన్నిబోధత’ అని ఉపనిషత్తుచెప్పినా రెండింటి అంతరార్థాలు ఒకటే. అయినా ఉపనిషత్తు చెప్పిన వర-శ్రేష్ఠం అన్న పదం కంటే ఈ ఋగ్వేద మంత్రంలోని ‘ఋత్వియం’ వ్యవస్థీకృతమైన భాగం అన్న పదంలో ఒక విశేషార్థం లోతుగా పరిశీలిస్తే ద్యోతకమవుతుంది. సృష్టిలోని సమస్త పదార్థాలమీద సర్వులకు సమాన హక్కులున్నాయి. ఎవరూ అధికులు కారు. ఎవరూ అధములుకారు. ఈ విభాగం విచారణారహితంగా చేసింది కాదు. కాని వారివారి సంపాదనా విధానాన్ని అనుసరించి చేయబడింది. కాకపోతే ఎవరు ఉత్తములు, ఎవరు అధములుగా అవుతారో వేదం వివరించింది. అంటే జీవితంలో ఎవరు ఎట్టిపనిని చేస్తారో దానిననుసరించి సృష్టిలోని పదార్థాలను ఎక్కువగాని తక్కువగాని పొందుతారు అని వేదం వివరించింది. ఈ విషయ వివరణకే ఈ మంత్రం పర్యాప్తంకాలేదు. ఎవరు తమ సత్కర్మచేత సృష్టిలోని అధికమైన ఐశ్వర్యాన్ని పొందితే ‘యది శ్రాతం జుహోతన’ అధికమైన ఆ ఐశ్వర్యాన్ని హోమం చేయుమని వేద మాదేశిస్తూంది. అంటే తన ఐశ్వర్యాన్ని మానవోపకారార్థంగా వినియోగించమని వేదమనోగం. ఆ విధంగా చేసే సమయంలో ‘ఇదం న మమ’ ఇది నాదికాదు. పూర్తిగా నీదే అన్న సంపూర్ణ్భావనతో భగవదర్పణం చేయాలని వేదాదేశం.

ఇంకావుంది...