స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-180

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యునినుండియే వర్ధిస్తూంది. సూర్యుడొక అగ్నిగోళమే కదా అని అనుకోనేరు. అలా కానేకాదు. సమస్త జీవులను పరిపోషించే జీవన రసాలన్నీ భూమినుండి ఉద్భవించే సమస్త పదార్థాలలోనికి సూర్యుని కిరణజాలం వర్షించే రసవృష్టి ద్వారా వచ్చి చేరుతూంది. అందువలననే భూమిపై వృక్ష, లతా, గుల్మాదులు పుష్పించి, ఫలించినట్లుగా వివిధ జీవులు ఉద్భవించి విరాజిల్లుతూ ఉన్నాయి. అట్టి శక్తి సూర్యునిలో బహుధా నిక్షిప్తమైయుంది. ఆ విధమైన శక్తిని సూర్యునిలో నింపినవాడు కూడ పరమాత్మయే. అందుకే వేదం ‘స శేవధిం ని దధిషే వివస్వతి సః’- ‘అతడే = ఆ భగవానుడే సూర్యునిలో అనేక కల్యాణ భాండాగారాలను నింపియున్నాడు’’ అని ఆ దైవ జీవకారుణ్యాన్ని ప్రశంసించి ఈ సృష్టిలో ‘సాస్యుక్థ్యః’ ‘‘కీర్తనీయుడవు’’ నీ వొక్కడవేనని భగవంతుని అద్వితీయతకు వేదం నమస్కరించింది.
**
భగవంతుడు సర్వోన్నతుడు
ప్రాక్త్భ్యు ఇంద్రః ప్ర వృధో అహభ్యః ప్రాంరిక్షాత్ప్ర సముద్రస్య ధాసేః
ప్ర వాతస్య ప్రథసః ప్ర జ్మో అంతాత్ప్ర సింధుభ్యో రిరిచే ప్ర క్షితభ్య.॥
॥ ఋ.10-89-11.
భావం:- పరమేశ్వరుడు రాత్రుల కంటె, పగళ్ల కంటె, అంతరిక్షం కంటె, ఆధిక్యమూ మరియు విశాలత కలవాడు. సముద్రము కంటె విశాలుడు. ధారణశక్తిలో మిన్న. వాయువు కంటె అధిక వ్యాపన శీలుడు. పృథివికి గల ధృవస్థానాల కావలివాడు. నదీ- నద- సముద్రాలకావల తీరంవాడు. భూమిపైగల నివాస స్థానాలకంటె చాల అధికుడు.
వివరణ:- తల్లి బిడ్డకు వలె వేదమాత జ్ఞానోపదేశం చేస్తుంది. కాలం చాల సుదీర్ఘమైనది. విశాలమైనది. కాలాన్ని గణించడం ఎవరివలన సాధ్యంకాదు. రాత్రింబవళ్లుగా కాలం విభజింపబడియున్నా దాన్ని ఎవరు గణించలేరు. ‘కాలోహ భూతం భవ్యం చ’ (అథర్వ వే.19-54-3) ‘‘్భతమూ భవిష్యత్తూ కూడ కాలమే’’నని అథర్వణవేదం వచిస్తూంది. భూతకాలం భవిష్యత్వాలమే అయితే భూతకాలమెంత సుదీర్ఘమైనదో ఎవడు చెప్పగలడు? అట్లే భవిష్యత్కాల దీర్ఘత్వమెంతో కూడ చెప్పేందుకు ఎవడు సాహసించగలడు? అందుకే వేదం ‘ప్రాక్త్భ్యు ఇంద్రఃప్ర వృధో అహభ్య.’ ‘దైవం (ఇంద్రుడు) తన వైశాల్యం చేత రాత్రింబవళ్లకంటె అత్యధికుడు’’ అని నిర్వచించింది. కాలగణనను కల్పంచడంలోనే వైకల్యమేర్పడితే కాలస్వరూపుడైన ఆ పరదైవాన్ని పరిగణించడం సాధ్యమా? కాబట్టి కాలం కంటె సుదీర్ఘవైశాల్యం గలవాడు, గణించుటకు అందనివాడు అయిన ఆ దైవం అంతరిక్షం కంటె విశాలమైనవాడు అని ఋగ్వేదం వేరే సందర్భంలో ‘త్వమస్య పారే రజసో వ్యోమనః’ (ఋ.1-52-12) ‘‘ఆకాశం కంటె కూడ నీవు పరమునందున్న వాడవు’’ అని దైవాన్ని శ్లాఘించింది. అంటే ఆకాశంలోని ఆకాశత్వం కూడ నీ ముందు సూక్ష్మమైనదే అని అర్థం. ఎందుకంటే-
‘న యస్య ద్యావాపృథివీ అను వ్యచో న సింధవో రజసో అంతమానసుః’॥ ఋ.1-52-14).
దివి, పృథివి, అంతరిక్షాలు ఎవని వ్యాపకత్వ- విశాలతలను, ఆద్యంతాలను అందుకోలేవో, వ్యాపనశీలమైన వాయువు పృథివీ- అంతరిక్షాలలో కేవలం పరిమిత ప్రదేశాలలో మాత్రమే వ్యాపించి యుండగలవో అట్టివాని వ్యాపకత ఆ దైవంముందెంత? అని ఋగ్వేదం వ్యాఖ్యానించింది.
ఈ మంత్రంలో మరో ముఖ్య విషయముంది. పరమాత్మ సర్వచరాచరాలలో అంతర్యామిగా ఉన్నా అన్నింటికంటె అతిరిక్తంగా అంటే వేరుగానే ఉన్నాడు. ఉద్దాలక అరుణ సంప్రశ్నకు యాజ్ఞవల్క్యుడు సమాధానమిస్తూ ఇదే విషయాన్ని వివరంగా ఇలా చెప్పాడు.
యః పృథివ్యాం తిష్ఠన్ పృథివ్యా అంతరో, యం పృథివీ న వేద, యస్య పృథివీ
శరీరం యః పృథివీమంతరో యమయతి, ఏషత ఆత్మాంతర్యామ్యమృత.॥
బృహదారణ్యకోపనిషత్తు 3-7-3.
భావం:- ‘‘పృథివిలోనే ఉంటూ పృథివికంటే వేరుగా ఉంటున్నవానికి పృథివియే శరీరమయినా ఆతడిని పృథివి ఎరుంగదు.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు