స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-181

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పృథివికి ఆంతరంగా ఉండి నియమిస్తున్నవాడే నీలో అంతర్యామిగా ఉన్న అమృతమయమైన ఆత్మ’’. ఇలా ఆత్మను సూత్రీకరించి యాజ్ఞవల్క్యుడు అగ్ని, అంతరిక్షం, వాయువు, దివి, ఆదిత్య, చంద్ర, తారలు, ఆకాశం, అంధకారం, తేజస్సు, సర్వభూతాలు, ప్రాణం, వాక్కు, చక్షువులు, శ్రోతలు, మనస్సు, చర్మం, విజ్ఞానం మరియు రేతస్సులలో ఉంటున్న ఆ భగవానుడు వానికంటే భిన్నుడే అని దీర్ఘమైన వివరణ ఇచ్చాడు. విశేషమేమంటే ఆ పరమాత్మ సమస్తంలో వ్యాపించి ఉంటూనే వానికి బహిరంగంగా కూడ ప్రకాశిస్తున్నాడని యజుర్వేదం ఈ ఋగ్వేదభావానే్న యిలా సమర్థించింది. ‘తదంతరస్య సర్వస్వ తదు సర్వస్యాస్య బాహ్యత.’ (శు.య.వే.40-5)
‘‘దైవం సమస్తమందు మాత్రమేగాక బహిరంగంగా కూడ ఉన్నాడు. ‘‘ఆ విధంగా సర్వాంతర్యామిగా ఉన్న పరమేశ్వరుడు సృజించిన విశాల సృష్టిరచన అల్పీయసమైన మానవ మేధస్సునకు అందకపోతే అది భగవానుని సర్వవ్యాపకత్వానికి లోటు కాదుకదా. సామవేదం ‘తావానస్య మహిమా తతో జ్యాయాంశ్చ పూరుషః’ (సా.వే.620) ‘‘దృశ్యమానమైన ఈ చరాచర జగత్తు భగవానుని మహిమను మహిమాన్వితంగా ప్రకాశింపచేస్తున్నదే’’అని పేర్కొన్నా దృశ్యమానం కాని చరాచర జగత్తు అంతకుమించిన భగవన్మహిమను ఎంత బహుగుణోపేతంగా ప్రకాశింపచేస్తున్నదో!!
**
వ్యాపారి సంపాదనను దొంగలు దోచేసారు
సమీం పణేరజతి భోజనం ముషే వి దాశుషే భజతి
సూనరం వసు దుర్గే చన ధ్రియతే విశ్వ ఆ పురు
జనో యో అస్య తవిషీమచుక్రుధత్‌॥ ఋ.5-34-7.
భావం:- సత్కార్యాచరణ యందు వ్యాపార దృష్టిగల వ్యాపారి ఆహారం అంటే అనుభవయోగ్యమైన సమస్త ద్రవ్యాలు చివరకు దొంగిలింపబడేందుకో లేదా దొంగల పాలో అవుతాయి. దానశీలుడికి ఉత్తమమైన ధనం విశేషంగా ఈయబడుతుంది. ఏ వ్యక్తి అట్టి దానశీలిని మాటిమాటికి అవమానపరుస్తాడో అతడు కష్టాలలో ఉన్నప్పుడు సమస్త జనుల చేత చాల హీనంగా బాధింపబడతాడు.
వివరణ:- పరమేశ్వరుడు నీకు పుష్కలమైన మంచి ఆహారాన్ని అనుగ్రహించాడు. దానిని నీవు నీ పొట్టనుమాత్రం నింపుకొనేందుకు గాక తోడి వారందరితో కలిసి పంచుకొని స్వీకరించు. అలా నీ ఆహారాన్ని ఎటువంటి వారికి పంచాలో కూడ వేదం వివరిస్తూంది. అన్నార్తుడైనవాడే అన్నప్రదానానికి అర్హుడు. ఈ అన్నార్తుడినే ఋగ్వేదం రమణీయంగా-
‘స ఇద్భోజో యో గృహవే దదాత్యన్నకామాయ చరతే కృశాయ’ ఋ.10-117-3.
‘‘అన్నార్తుడై తిరుగుతూ ఉండేవాడే భోజుడు. అట్టి దుర్బలుడికే అన్నదానం చేయబడాలి’’అని నిర్వచించింది. ఈ విషయానే్న ఋగ్వేదం (10-117-5) ‘పృణీయాదిన్నాధమానాయ తవ్యాన్ ద్రాఘీయాంసమను పశే్యత పంథామ్’ ‘‘బలీయుడైనవాడు యాచకుణ్ణి సంతృప్తిపరచాలి. సుదీర్ఘమైన సన్మార్గాన్ని దర్శించాలి’’అని స్పష్టపరచింది. వేద మే విషయాన్నీ రహస్యంగా ఉంచదు. అన్నింటిని స్పష్టంగానే వివరిస్తుంది. పై మంత్రంలోని సుదీర్ఘమైన మార్గమేదో వివరిస్తూ ఋగ్వేదం (10-117-5) ‘ఓ హి వర్తంతే రథ్యేవ చఖ్రాన్యమన్యముప తిష్ఠంప రాయ.’ ‘‘్ధనం రథచక్రాలవలె ఒకరివద్దనుండి మరియొకరి వద్దకు పోతూ ఉంటుంది’’ అని సోపమానంగా చెప్పింది. అంటే ధనపయనమార్గం రథచక్ర సుదీర్ఘమార్గ ప్రయాణం వంటిది. ఆ ప్రయాణంలో ధనమొకచోటనే నిలువక సదా మరొక చోటకు పోతుందని భావం.
వీరికి నేనెందుకు ఆహారం పెట్టాలి? దీనివల్ల నాకేమి లాభం? అని ఆలోచించేవాడే వ్యాపారి. అట్టివాడు తినే ఆహారానికేమి గతిపడుతుందో ఈ మంత్రంలో వివరింపబడింది. ‘సమీం పణే రజతి భోజనం మృషే’ ‘‘వ్యాపారి ఆహారం లేదా భోజనానికి పట్టే గతి దొంగతనమే. అట్టి మూర్ఖజన వ్యాపారికి జరిగే శిక్ష ఏమిటో ‘మోఘమన్నం విందతే అప్రచేతాః సత్యం బ్రవీమి వధ ఇత్స తస్య’(ఋ.10-117-6) ‘‘ఆ మూఢుడు వ్యర్థమూ లేదా నిష్ప్రయోజనమైన ఆహారానే్న లేదా భోజనానే్న పొందుతాడు’’ అది వాడి పాలిటి మరణప్రాయమే అవుతుంది. ఇది సర్వధా సత్యం’’అని ఋగ్వేదం శపథంచేసిమరీ చెప్పింది. నిజమే. తనవద్దనున్న ధనం తాను అనుభవించక దాచిపెట్టి దాచిపెట్టి ఏ దొంగ చేతిలోనో ధనానే్న కాదు ప్రాణాలను కూడ పోగొట్టుకొనడం మనమందరం చూస్తున్నదేకదా! భగవంతుడు జీవులకు సర్వమూ దానం చేసే మహాదాత. లోభి ఆ మహాదాత అయిన పరమాత్మ తనకింకా ఏదో ఈయలేదని దైవంమీద ఆగ్రహిస్తూ ఉంటాడు. ఆ కారణంచేత అతడు ‘దుర్గే చన ధ్రియతే విశ్వ ఆ పురు’ ‘‘మహా సంకటాలలో పడిపోతాడు’’ ఆ సమయంలో ఆతడికేవిధంగాను ఇతరులు సహాయపడరు.
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు