స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-185

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యాధిస్త్యాన సంశయ ప్రమాదాలస్యావిరతి భ్రాంతి దర్శనాలబ్ధ భూమికత్వా నవస్థితత్వాన్ని చిత్త విక్షేపాస్తే న్తరాయాః. అన్న సూత్రానుసారం వ్యాధి, స్త్వాన= భారకత్వం, సందేహం అజాగ్రత్త, సోమరితనం, అవిరతి= యోగసాధనాల ఆచరణలో అనాసక్తి, భ్రాంతికారక వస్తు దర్శనం, చిత్తచాంచల్యం, యోగ భూమికను పొందకపోవడం, ఇవన్ని యోగసిద్ధికి విఘ్నకారకాలు. వీనిలో ముఖ్యమైన సంశయమనే దానిలో చిక్కుకొని భగవదారాధననే విడిచేందుకు సిద్ధపడిన సంశయగ్రస్తు హృదయంలో ఉన్న పరమాత్మ దయాళువై ఇలా ప్రబోధిస్తున్నాడు. ‘అయమస్మి జరితః’=‘‘ఓ భక్తుడా! నేనిక్కడే ఉన్నాను’’కాని నీవు నాకోసం వెతుకుతున్నావు. నాకోసం అటుఇటు పరుగుపెట్టకు. పశ్యమేహ=‘‘నువ్విక్కడే చూడు. మరెక్కడకు వెళ్లవలసిన పని లేదు. నీలో అంతర్యామిగా ఉన్న ఆత్మను నేనే’’. విశ్వాజాతా న్యభ్యస్మి మహ్నా= ‘‘నా మహత్వశక్తితో ఈ సమస్త విశ్వాన్ని నా నియంత్రణ (అదుపు)లో ఉంచుకొన్నాను’’ సమస్తజగత్తు నా ఆజ్ఞానుసారమే నడుచుకొంటున్నది. ఇష్టపడితే నీవు నా పూజ చేయి. లేకుంటే మాను. ఋతస్య మా ప్రదిశో వర్ధయంతి= ఋతాన్ని అంటే అనుల్లంఘనీయమైన సృష్టినియమాలను- శాసనాలను జ్ఞానులు నన్ను సమున్నతంగా ఆరాధిస్తున్నారు.
మూర్ఖ శిరోమణులు భగవానుని స్మరణ, ధ్యానాలను చేయరు. కాని కార్య కారణవేత్తలైన ఋత ప్రచారకులు కారణం లేకుండా కార్యం పుట్టదు. కారణానికి ఆలంబనుడయిన కర్తలేకపోతే కార్యమెలా సంభవమవుతుంది. చిన్న పదార్థమైనా చైతన్యరహితమై ఉండనప్పుడు ఈ అఖండ విశ్వం చైతన్యరహితంగా ఎలా జనిస్తుంది అని గ్రహించినవారై భగవానుడనైన నన్నారాధిస్తూ ‘ప్ర వ ఇంద్రాయ బృహతే మరుతో బ్రహ్మార్చత’ నీవు మహేంద్రుణ్ణి వేదోక్తంగా ఆరాధించు’’మని ఇతరులకు ప్రబోధిస్తూ ఉంటారు. భగవచ్ఛక్తి అనుమాన ప్రమాణంచేత గ్రహించుకోవాలే గాని ప్రత్యక్షమై ఉండదు. కాని ఆయన వినాశనశక్తిని చూడగానే అందరు ఆయన ఎడల భక్తితత్పరులైపోతారు. అట్టి తన ప్రళయకార శక్తిని వివరిస్తూ ‘ఆ దర్ధిరో భువనా దర్దరీమి’= ‘‘నేను ప్రళయకారుడనై లోకాలను పలుమారులు వినాశనం చేస్తున్నా’’నని ప్రకటించాడు. చిత్రమేమంటే ఆయన సంహారశక్తికి భయపడి దగ్గరకు వచ్చి ఆశ్రీతుడైన వానికి రక్షకునిగా దర్శనమిస్తాడు. లౌకికంగా సంహారకుడైన క్రూరుడైనవానికి సంహారక శక్తిసంపన్నుడైన భగవంతునకు ఏమీ పోలిక లేదు. నదులు ఉప్పొంగి గ్రామాలను ముంచి నాశనం చేసినట్లు, కార్చిచ్చు అడవులనేకాక జనులనుకూడ దహింపజేసినట్లుగా పరమేశ్వర సంహారకశక్తి సృష్టినాశనాన్నిగాక పునఃసృష్టికారకమవుతుంది. కాబట్టి జనులకు దైవసంహారక శక్తికూడ ప్రియాతిప్రియమే అవుతుంది. అందుకే సృష్టినిర్మాణంలో సంహారకశక్తి కూడ దైవశక్తిగా ఆరిధింపబడింది.
***
174. దేవాధిదేవ! నీ నామానే్న జపిస్తాను
భావం:- ఓ దేవా! నీ మాటలనే నెన్నడు తిరస్కరింపను. నిన్ను నమ్మి జీవిస్తూ ఇతరులకు నిరంతరం శీఘ్రంగా మేలుచేసే జీవనాధారుడవైన నిన్ను గురించి చేసే సన్నుతులను కూడ విడువను. అంతేగాక అపూర్వ కీర్తివంతమైన నీ నామాన్ని సదా స్మరిస్తూ ఉంటాను.
వివరణ:- ఓ మహాదేవా! నీ ఎడల నాకు బహుప్రీతి ఉంది. ఈ మాటను నేను నిజంగానే చెబుతున్నాను. మాతాపితలు. దారాపుత్రులు, మిత్ర- బాంధవులను మాటలను వినీ వినక పెడచెవిని పెడతాను. కాని నీ మాటలను చెవులార వినే సౌభాగ్యాన్ని నేను చేతులార ఎందుకు వదులుకొంటాను? ఓ పరమాత్మా! నీతో నేనేమని చెప్పను? నీకు తెలియనీయక దేనిని దాచిపెట్టగలను? నీకు సర్వమూ తెలుసు. కాని నే నొక్కమాట చెప్పగలను. అదేమంటే- ‘న తే గిరో అపి మృష్యే’ ‘‘నీ మాటలనెన్నడు తిరస్కరించను అని. నీ మాటలను ప్రేమిస్తాను. సంపూర్ణంగా గౌరవిస్తాను. నీ మాటలనే చింతిస్తూ అనుసరిస్తూ, ఆ ప్రకారంగా ఆచరిస్తూ, ప్రచారం చేస్తాను. ఓ జగన్నాథా! నీవు సృష్టికార్యాలను అతి శీఘ్రంగా చేసేవాడవు. క్షణకాలంలో సృష్టికి ప్రళయాన్ని కల్పించగలవాడవు జగజ్జీవనమంతా నీపై ఆధారపడి ఉంది. నీ గుణగణాలను లెక్కింప సామర్థ్యమెవరికుంది. అది నాకు మాత్రం సాధ్యమా? అయితే నాకు చేతనయినంతగా నిన్ను సన్నుతిని చేస్తాను నీవే పాలకుడవు. నీవే సృష్టికర్తవు. ఓ దేవాధిదేవా! అజ్ఞానకారణంగానో, అజాగ్రత్త కారణంగానో నీ ఆదేశాన్ని వినకపోవచ్చు. విన్నా సరిగా అర్థం చేసికొనలేకపోవచ్చు. ఎప్పుడైనా నీ సంస్తుతిలో పొరపాటు దొర్లవచ్చు! అదంతా నా అల్పజ్ఞత్వమే. దానివల్ల అనేక కష్టాలు సంభవిస్తాయి. ఇదివరకే నేను దానివల్ల ఎదురుదెబ్బలు కూడ తిన్నాను. నాకు బుద్ధివచ్చింది. నీ మాటలనే విని ఆచరించేందుకు తహతహలాడుతున్నాను. ‘సదా తే నామ స్వ యశో వివక్మి’ ‘‘కీర్తివంతమైన నీ నామానే్న జపిస్తాను’’ కాని నీ మహిమ నెరుంగని మూఢుడను. ‘మనీషీ హవతే త్వామిత్’ ‘‘మహాబుద్ధిమంతుడైనవాడు కూడ నినే్న పిలిచి ప్రార్థిస్తాడు’’ ఇక నేనెంత వాడను?
ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు