స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక కాలంలో మహర్షితుల్యుడైన దయానంద సరస్వతి ఈ విషయాన్ని విపులంగా ఇలా వివరిస్తున్నారు.
‘‘జితేంద్రియుడు కావాలనే కోరిక గలవాడు రాత్రింబవళ్లు ప్రణవాన్ని (ఓంకారాన్ని) తప్పక జపించాలి. జపం చేస్తూండగా రాత్రి ప్రొద్దుపోతే అవసరమైనంతవరకు నిద్రించి మరల మేల్కొని ప్రణవ జపాన్ని ఆరంభించాలి. ఎందుకంటే ఎక్కువ సమయం నిద్రిస్తే కాలమంతా స్వప్నాలలో గడిచిపోతుంది. ఇది జితేంద్రియుడను కావాలనుకొనే వారికి శుభదాయకం కాదు.’’
మనస్సును పరమాత్మపై లగ్నం చేయి. బాహ్యేంద్రియ విషయాలు తమంత తామే వైతొలగిపోతాయి. అప్పుడు నిద్రించినచో ఏ కలలూరావు. మనస్సు సుషుప్తిదశనుండి తురీయావస్థకు చేరుతుంది.
**
ఋజుమార్గ ప్రవర్తన
అపక్రామన్ పౌరుషేయాద్ వృణానో దైవ్యం వచః
ప్రణీతీర భ్యావర్తస్వ విశే్వభిః నభిభిః సహ॥
అథ.వే.7-105-1॥
భావం:- మానవుల మాటలను ఉపేక్షించి దైవ వచనాల (వేదాల)ను ఎంచుకొని అనుసరించు. మిత్రులందరితోకూడి సత్ప్రవర్తనలను నలువైపుల వ్యాపింపచేయి.
వివరణ:- మానవ జీవితానికి పరమలక్ష్యమేమిటి? అన్న విషయంలో చాలా కొద్దిమంది మాత్రమే ఆలోచన చేస్తారు. అయితే ఎక్కువమందికి మాత్రం తమ జీవిత లక్ష్యమేమిటో తెలియనే తెలియదు. తినడం, త్రాగడం, దుస్తులు ధరించటం, పిల్లలను కనడం, సుఖాలననుభవించడం, కష్టాలకు దుఃఖించడం ఇంతకు తప్ప వారికేమీ తెలియదు. ఈ పనులను పశుపక్ష్యాదులు కూడ చేస్తూనే ఉన్నాయి. అయితే మనుష్యుని ఘనత ఏమి?
ఈ పశుప్రవృతుతలను సంతృప్తిపరచడమేనా మాన జీవిత లక్ష్యం? అలాకాక మానవ జీవితానికి ఒక ప్రత్యేకమైన లక్ష్యమేదైనా ఉందా? ఉంటే దానికి తప్పక ఒక ఉపదేశం కావాలి. ఏ మాటల గారడీతోనో, ఏ చమత్కారకర్మల వల్లనో భోగ సామగ్రిని సంపాదించేందుకే అధికాంశం మానవుల జీవితం గడిచిపోతూంది? దైవం మనిషిని పుట్టించినప్పుడే కొంత జ్ఞానాన్ని కూడ అతడికి ప్రదానం చేసారు. ఆ జ్ఞానమే వేదం. అదే ‘దైవ్యం వచః’ ‘్భగవద్వచనం అని చెప్పబడుతూంది. ఈ విషయాన్ని గురించి వేదం ‘అపక్రామన్ పౌరుషేయాద్ వృణానో దైవం వచః’ ‘‘మానవ వచనాలను విస్మరించి భగవద్వచనాలను ఎంచుకొని అనుసరించు’’మని హితవు పలికింది.
మానవ జీవనోద్దేశ్యం- తత్సిద్ధికి సాధనాలు వేద వచనాలలో ఉన్నాయి. మహామహులైన విద్వాంసులు సహితం మానవ జీవితానికి విహితమైనట్టి కర్తవ్యమిదేనని చెప్పజాలరు. అందుకే సృష్ట్యారంభంలో భగవానుడు మానవ కల్యాణంకోసం వేద సాహిత్యాన్ని అందించాడు. వేదవిజ్ఞానం సమస్త అజ్ఞానాన్ని- దానివలన కలిగే పశుప్రవృత్తులను వినాశం చేస్తుంది. ఈ విషయమే విద్వాంసుల వచనంగా అథర్వణవేదంలో ఇలా కనబడుతూంది.
‘ఉత్ త్వా నిరృత్యాః ఆశేభ్యోదైవా వాచా భరామసి’ (అథ.వే.8-1-3) ‘‘దైవీ వాక్కు అయిన భగవద్వచనాల ద్వారా మేము మిమ్ము పాపపాశాలనుండి విముక్తులను చేస్తున్నాం’’. వేదంలో ఈ దైవీవాక్కే ‘కల్యాణీవాణి’గా (శు.య.వే.26-2) చెప్పబడింది. దీని సమాంతర అర్థమే ‘ప్రణీతీరభ్యావర్తస్వ విశే్వభిః సభిభిః సహ’ ‘‘సమస్తమైన మిత్రులతో కూడి ఉత్తమ ప్రవర్తనలను నలువైపుల వ్యాపింపచేయుము’’ అని మానవుడు సంఘజీవి. ఏ మనిషి పరోక్షంగాగాని ప్రత్యక్షంగా గాని ఇతరుల సహాయాన్ని పొందకుండ జీవింపలేడు. ఇదే పరస్పరాశ్రయమైన సమాజ నిర్మాణానికి మూలసూత్రం.
- ఇంకాఉంది