తెలంగాణ

ట్యాంక్‌బండ్‌పై 27న విహెచ్ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు, కారకులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న ట్యాంక్ బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దీక్ష చేయనున్నట్లు ఎఐసిసి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు తెలిపారు. రోహిత్ ఆత్మహత్యకు చలించి దేశంలోని ముఖ్య రాజకీయ నాయకులు సెంట్రల్ వర్సిటీకి వచ్చి విద్యార్థుల ఉద్యమానికి మద్దతు పలికారని, రోహిత్ కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారని, కాని ముఖ్యమంత్రి మాత్రం వెళ్లలేదని విమర్శించారు.
టి.కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ టిఆర్‌ఎస్ మ్యానిఫెస్టో ఒక అభూత కల్పన అని విమర్శించారు. రెండేళ్ళలో 300 ఇండ్లు కట్టారని, లక్ష ఇండ్లు ఎప్పుడు కడతారని ఆయన ప్రశ్నించారు.