తెలంగాణ

హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సిఎం కెసిఆర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: హైకోర్టు చీఫ్ జస్టిస్ దిలీప్ బొంస్లేతో మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విధితమే. ఈ ఘటనలో హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చీఫ్ జస్టిస్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ముఖ్యమంత్రి చీఫ్ జస్టిస్‌తో భేటీ కావడానికి ఎలాంటి ప్రాధాన్యత లేదని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు అంటున్నారు. సిఎం కెసిఆర్ నిర్వహించిన అయుత చండీయాగానికి చీఫ్ జస్టిస్ హాజరు కావడంతో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారని తెరాస వర్గాల సమాచారం.