జాతీయ వార్తలు

మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల సమయానికే పలు పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు బారులు తీరారు. చెన్నైలో ముఖ్యమంత్రి జయలిలిత, డిఎంకె అధినేత కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్, డిఎండికె అధ్యక్షుడు, నటుడు విజయ్‌కాంత్, ఆయన భార్య ప్రేమలత, సినీనటులు రజనీకాంత్, కమల్‌హాసన్ తదితర ప్రముఖులు ఓటు వేశారు. మధురైలో వర్షం పడుతున్నప్పటికీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. తిరువనంతపురం (కేరళ)లో కేంద్ర మాజీ మంత్రి ఎకె ఆంటోనీ, మళయాల నటుడు, బిజెపి ఎంపీ సురేష్ గోపి ఓటు వేశారు. పుదుచ్చేరిలోనూ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.