భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా -11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరూ భక్తితో ప్రణమిల్లిన తర్వాత ‘‘మహర్షి! రాక్షసులలో దైత్య, దానవులన్న రెండు తెగలేవిధంగా ఏర్పడ్డాయో తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను! రంభ, కరంభులు ప్రహ్లాదుని సంతతికి చెందినవారు కాదా?’’ అని అడిగాడు ఒక ముని కుమారుడు లేచి వినయంగా నమస్కరించి!
అతని వైపు చిరునవ్వుతో చూశారు సూతమహర్షి!
‘‘మంచి ప్రశే్న అడిగావు! కశ్యపుని పద ముగ్గురు భార్యలలో అదితికి దేవతలు జన్మించారు! దితి, దను, సింహిక అనే ముగ్గురికి తమోగుణ ప్రధానులైన రాక్షసులు జన్మించారు! దితిపుత్రులు దైత్యులనీ, దను పుత్రులు దానవులనీ పిలవబడ్డారు! దైత్యులు, దానవులు అన్యోన్యంగా కలిసి వుండేవారు! సింహికకు జన్మించిన పుత్రుడు రాహువు సైన్యాధిపతిగా నియమింపబడ్డాడు. సింహక తపస్సుతో బ్రహ్మను మెప్పించి తన పుత్రుడు అమరత్వం, దైవత్వం పొందేట్లు వరం పొందింది! ఆ కారణంగానే క్షీర సాగర మథన సమయంలో మహావిష్ణువు రాహువుమీద జగన్మోహిని మాయను ప్రసరింపజేయలేదు! అందువల్ల రాహువు దేవతల పంక్తిని చేరి అమృత పానం కావించాడు! అతను తమోగుణ ప్రధానుడు, కనుక అతని శరీరాన్ని రెండు భాగాలు చేసి వాటికి సర్పాకృతి అనుగ్రహించి గ్రహ మండలంలో ప్రత్యేక స్థానాలిచ్చి దైవత్వాన్ని ప్రసాదించాడు శ్రీమహావిష్ణువు!
దైత్యులలో వాళ్ల తల్లి తపస్సు ఫలితంగా బలపరాక్రమవంతులైన కుమారులు జన్మించి ముల్లోకాలను జయించి, నిరంకుశంగా పాలిస్తుండటం, వాళ్లను శ్రీమహావిష్ణువు సంహరిస్తుండటం జరిగేది!
దానవులలో దనువు అనే రాక్షసుని పుత్రులైన రంభ, కరంభులకు తమ పుత్రులు ముల్లోకాలు జయించాలన్న కోరిక కలగడంతో వారుకూడా తపస్సుకు పూనుకోవటం, మహిషుడు జన్మించటం జరిగింది కదా! మహిషుని లాగే దానవ ప్రభువులైన శుంభ నిశుంభులను కూడా జన్మాగతే వధించింది! వీరందరూ స్ర్తి చేత మాత్రమే మరణాన్ని వరంగా పొందడం కూడా అందుకు కారణం! ఇక మహిషాసురుని మరణానంతరం అతని సోదరి మహిషి కోరిన చిత్రమైన కోరిక మఠికంఠుని అవతరణానికి కారణమైంది!’’ అంటూ చెప్పటం కొనసాగించారు సూతమహర్షి!
***
‘‘ఓం బ్రహ్మదేవాయనమః! ఓం బ్రహ్మదేవాయనమః!’’ అంటూ సత్యలోకాన్ని చుట్టివేసి ప్రతిధ్వనించసాగాయి. భూలోకాన్నుండి ఎగిసివచ్చిన తపోజ్వాలలు! వాటివైపు ఆందోళనగా చూస్తూ ‘‘స్వామీ! మహిషి కావిస్తున్న తపస్సు అంతకంతకు తీవ్రవౌతున్నది! ఆ తపోజ్వాలలను అరికట్టకపోతే లోకాలను దహించివేయగలవు! ఆమె తపస్సును విరమించేలా చేయవలసిన బాధ్యత మీదే గదా స్వామీ!’’ అన్నది సరస్వతీదేవి ఆందోళనగా చూస్తూ!
‘‘అవును! ఆమె తపస్సును విరమింపజేయడానికి దేవతలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు! ఇక నేను తరలి వెళ్లక తప్పదు!’’ అని హంస వాహనరూఢుడై మహిషి ముందర సాక్షాత్కరించాడు బ్రహ్మదేవుడు!
‘‘పుత్రీ! నీ తపస్సుకు ప్రసన్నుడినైనాను! ఏం వరం కావాలో కోరుకో!’’ అంటూ బ్రహ్మ పలుకులు వినిపించడంతో కళ్లు తెరిచి చూసింది మహిషి! భక్తిపూర్వకంగా నమస్కరించి ‘‘హే విధాతా! నాకు అమరత్వాన్ని ప్రసాదించండి’’ అంటూ కోరింది!
‘‘అమరత్వం అమృతపానంతోనే లభ్యవౌతుంది! కనుక అది తప్ప వేరే ఏదైనా కోరిక వుంటే చెప్పు, తప్పకుండా తీరుస్తాను!’’ అన్నాడు బ్రహ్మ శాంత గంభీర స్వరంతో!
కొద్దిసేపు వౌనంగా ఆలోచించి ‘‘అయితే శివకేశవులకు జన్మించి, పనె్నండు సంవత్సరాలు భూలోకంలో పెరిగిన బాలుడు చేతిలో తప్ప ఇతరులెవరి వల్లా మరణం రాకుండా అనుగ్రహించండి’’ అని వేడుకుంది మహిషి!!
‘‘తథాస్తు!’’ అని అంతర్థానం చెందాడు బ్రహ్మదేవుడు!
-ఇంకా ఉంది

-డా టి. కళ్యాణీసచ్చిదానందం